News February 22, 2025

సిద్దిపేట: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

image

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడ్గ గ్రామానికి చెందిన వుడెం మల్లారెడ్డి శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. స్థానికుల వివరాలిలా.. శుక్రవారం అర్ధరాత్రి బైక్ పై సిద్దిపేట నుంచి మర్పడ్గకు వస్తుండగా పొన్నాల ఆయిల్ మిల్ దాటాక మూల మలుపు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో మల్లారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 18, 2025

GOOD NEWS: భారీగా ఉద్యోగాలు.. త్వరలో జాబ్ క్యాలెండర్

image

AP: నిరుద్యోగులకు శుభవార్త. త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు అన్ని శాఖల్లోని ఖాళీల సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తోంది. ఇప్పటి వరకు 157 విభాగాల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద 99వేల పోస్టులు ఉన్నట్లు సమాచారం. పంచాయతీరాజ్ శాఖలో 26K, పట్టణాభివృద్ధిలో 23K, ఉన్నత విద్యలో 7K, స్కిల్ డెవలప్‌మెంట్‌లో 2,600, రెవెన్యూలో 2500, వ్యవసాయ శాఖలో 2,400, మహిళాభివృద్ధి విభాగంలో 1,820 ఖాళీలున్నట్లు తెలుస్తోంది.

News November 18, 2025

HYD: NIMSలో అడ్వాన్స్ టెస్టింగ్

image

పంజాగుట్ట NIMS ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రయోగశాలని ఆధునికీకరించి రియల్‌ టైమ్ పీసీఆర్, ఎలిజా, మైక్రో బయాలజికల్ పద్ధతులతో పరీక్షలు చేస్తున్నారు. వైరాలజీ ల్యాబ్‌లో కరోనా, హెపటైటిస్, డెంగ్యూ, ఇన్‌ఫ్లుయెన్జా వంటి వైరస్‌లపై పరిశోధనలు నిర్వహించనున్నట్లు వైద్యులు వెల్లడించారు.

News November 18, 2025

HYD: NIMSలో అడ్వాన్స్ టెస్టింగ్

image

పంజాగుట్ట NIMS ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రయోగశాలని ఆధునికీకరించి రియల్‌ టైమ్ పీసీఆర్, ఎలిజా, మైక్రో బయాలజికల్ పద్ధతులతో పరీక్షలు చేస్తున్నారు. వైరాలజీ ల్యాబ్‌లో కరోనా, హెపటైటిస్, డెంగ్యూ, ఇన్‌ఫ్లుయెన్జా వంటి వైరస్‌లపై పరిశోధనలు నిర్వహించనున్నట్లు వైద్యులు వెల్లడించారు.