News February 22, 2025

సిద్దిపేట: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

image

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడ్గ గ్రామానికి చెందిన వుడెం మల్లారెడ్డి శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. స్థానికుల వివరాలిలా.. శుక్రవారం అర్ధరాత్రి బైక్ పై సిద్దిపేట నుంచి మర్పడ్గకు వస్తుండగా పొన్నాల ఆయిల్ మిల్ దాటాక మూల మలుపు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో మల్లారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News March 19, 2025

వట్టిచెరుకూరు: చిన్నారిపై అత్యాచారం.. వృద్ధుడిపై పోక్సో కేసు

image

బిస్కెట్ ప్యాకెట్ ఆశ చూపి ఏడేళ్ళ చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడో వృద్ధుడు. వట్టిచెరుకూరు మండలంలో ఈ అమానుషం జరిగింది. సీఐ రామానాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. కె.థామస్(55) ఇంటి పక్కనే ఉన్న చిన్నారిపై ఈ నెల 14న ఎవరూ లేని సమయంలో అత్యాచారం చేశాడు. అనారోగ్యంగా ఉన్న బాలికను తల్లిదండ్రులు ప్రశ్నించగా జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో వృద్ధుడిపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేశామన్నారు.

News March 19, 2025

ప.గో : అమ్మకు చీర కొనడానికి దొంగతనం.. చివరికి

image

ఏలూరు జిల్లా చాట్రాయికి చెందిన సురేందర్ తెలంగాణలో కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రాంత పోలీసులు మంగళవారం సురేందర్ నేరాలను వివరించారు. 90 కేసుల్లో నిందితుడిగా ఉన్న అతను పశ్చిమ గోదావరి జిల్లాలోనూ దొంగతనం చేసినట్లు వెల్లడించారు. మొదటిసారి అమ్మకు చీర కొనడానికి రూ.300 దొంగతనం చేశాడన్నారు. అతడి వద్ద రూ. 45 లక్షల సొత్తు రికవరీ చేసి, రిమాండ్ కు తరలించామన్నారు.

News March 19, 2025

కశింకోట: హత్యకు గురైంది హిజ్రాగా గుర్తించిన పోలీసులు

image

కసింకోట మండలం బయ్యవరం వద్ద హత్యకు గురైంది హిజ్రాగా పోలీసులు గుర్తించారు. మృతదేహంలో సగభాగాన్ని గోనె సంచులో పెట్టి బయ్యవరం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు వదిలిపెట్టి వెళ్లిపోయారు. మిగిలిన అవయవాలను అనకాపల్లి డైట్ కళాశాల ప్రాంతంలో పోలీసులు గుర్తించారు. హత్యకు గురైంది ముందు మహిళగా పోలీసులు భావించారు. కాగా దర్యాప్తులో హిజ్రాగా నిర్ధారణ అయింది.

error: Content is protected !!