News April 13, 2025
సిద్దిపేట: లారీని ఢీ కొట్టిన ట్రావెల్స్ బస్సు

ఆగి ఉన్న లారీని వెనక నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ టోల్గేట్ వద్ద జరిగింది. స్థానికుల వివరాలు.. కరీంనగర్ పద్మ నగర్కి చెందిన వారు బంధువుల పెళ్లికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్కు వెళ్లి వస్తుండగా టోల్గేట్ వద్ద ఆగి ఉన్న లారీని ట్రావెల్స్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో సుమారుగా 10 మందికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమం ఉంది.
Similar News
News January 8, 2026
సానుకూల దృక్పథం ఏర్పడేలా చూడాలి: కలెక్టర్

రవాణా శాఖలో పనిచేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బంది ప్రవర్తన, ప్రజల్లో సానుకూల దృక్పథం పెరిగేలా ఉండాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో రవాణా శాఖ అధికారులతో గురువారం కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాస్థాయిలో రవాణా శాఖపై ప్రజల్లో సానుకూల దృక్పథం ఏర్పడేలా చూడాలన్నారు.
News January 8, 2026
నల్గొండ: చికిత్స వికటించి మూడేళ్ల బాలుడు మృతి

పట్టణంలోని సంజీవని ఆసుపత్రిలో చికిత్స వికటించి <<18802666>>మూడేళ్ల బాలుడు<<>> మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాలు.. నిమోనియాతో డిసెంబర్ 31న బాలుడిని ఆసుపత్రిలో చేర్చగా, చికిత్స అందిస్తున్న డాక్టర్లు త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. గురువారం సెలైన్ ఎక్కించిన కొద్దిసేపటికే బాలుడు మరణించాడు. నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయాడంటూ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
News January 8, 2026
జాతీయ షూటింగ్ బాల్ పోటీలకు కృష్ణా జిల్లా క్రీడాకారులు

మహారాష్ట్రలోని సోలాపూర్లో జనవరి 8 నుంచి 10 వరకు జరిగే సీనియర్ జాతీయ షూటింగ్ బాల్ పోటీలకు కృష్ణా జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు. కావలిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటిన పి.హనీత్ నాగ్, పి.శరన్ హేమంత్, సురేఖ జాతీయ స్థాయికి అర్హత సాధించారు. విజయవాడ నుంచి పోటీలకు బయలుదేరిన ఈ క్రీడాకారులను పలువురు ప్రముఖులు అభినందిస్తూ, పతకాలతో తిరిగి రావాలని ఆకాంక్షించారు.


