News April 13, 2025

సిద్దిపేట: లారీని ఢీ కొట్టిన ట్రావెల్స్ బస్సు

image

ఆగి ఉన్న లారీని వెనక నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ టోల్‌గేట్ వద్ద జరిగింది. స్థానికుల వివరాలు.. కరీంనగర్ పద్మ నగర్‌కి చెందిన వారు బంధువుల పెళ్లికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్‌కు వెళ్లి వస్తుండగా టోల్‌గేట్ వద్ద ఆగి ఉన్న లారీని ట్రావెల్స్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో సుమారుగా 10 మందికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమం ఉంది.

Similar News

News November 17, 2025

భూపాలపల్లి: ‘బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తప్పనిసరిగా నమోదు చేయాలి’

image

అన్ని శాఖల అధికారులు, సిబ్బంది బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. సోమవారం భూపాలపల్లిలోని ఐడీఓసీలో బయోమెట్రిక్ హాజరు నమోదుపై అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ..శాఖల వారీగా బయోమెట్రిక్ హాజరు నమోదు తప్పనిసరి చేస్తూ, బయోమెట్రిక్ హాజరు పరిశీలన ఆధారంగా మాత్రమే వేతనాలు చెల్లించే విధానం అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.

News November 17, 2025

భూపాలపల్లి: ‘బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తప్పనిసరిగా నమోదు చేయాలి’

image

అన్ని శాఖల అధికారులు, సిబ్బంది బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. సోమవారం భూపాలపల్లిలోని ఐడీఓసీలో బయోమెట్రిక్ హాజరు నమోదుపై అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ..శాఖల వారీగా బయోమెట్రిక్ హాజరు నమోదు తప్పనిసరి చేస్తూ, బయోమెట్రిక్ హాజరు పరిశీలన ఆధారంగా మాత్రమే వేతనాలు చెల్లించే విధానం అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.

News November 17, 2025

సమస్యల పరిష్కరానికి చర్యలు తీసుకోవాలి: భూపాలపల్లి కలెక్టర్

image

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం భూపాలపల్లిలోని ఐడీఓసీలో ప్రజల నుంచి ఆయన 37 దరఖాస్తులు స్వీకరించి, పరిష్కరానికి చర్యలు తీసుకోవాలని సబంధిత అధికారులకు ఎండార్స్‌మెంట్ చేశారు. తదుపరి ప్రజావాణి వరకు జీరో పెండింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.