News March 18, 2025

సిద్దిపేట: లిఫ్ట్ గుంతలో కుళ్లిన శవం లభ్యం

image

ములుగు మండలం లక్ష్మక్కపల్లి శివారులో ఓ కంపెనీ నిర్మాణ లిఫ్టు గుంతలో కూలిన శవం లభించినట్లు ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు. ములుగు మండలం తానేదార్ పల్లికి చెందిన జామకాయల నర్సింలు (42) ఇంటి నుంచి వెళ్లి రెండు నెలలుగా కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యలు పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సోమవారం కుళ్లిన స్థితిలో నర్సింలు శ్యామ్ లభించినట్లు ఎస్ఐ తెలిపారు.

Similar News

News November 27, 2025

ఐదేళ్లలోపు పిల్లలకు ఆధార్ చేయించాలి: కలెక్టర్

image

జిల్లాలో 0- 5 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకు ఆధార్ నమోదు చేయించాలని కలెక్టర్ జితేష్ వీ పాటిల్ సూచించారు. కలెక్టరేట్లో బుధవారం అన్ని శాఖల అధికారులతో ఆయన జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ప్రతి మండలంలో ఆధార్ నమోదు కేంద్రాలు పని చేయాలని, 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు దాటిన వారు ఆధార్ బయోమెట్రిక్ చేయించుకోవాలని కోరారు.

News November 27, 2025

రిజర్వేషన్లపై హైకోర్టులో నేడే విచారణ

image

TG: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలంటూ <<18397909>>దాఖలైన<<>> పిటిషన్‌పై ఇవాళ HCలో విచారణ జరగనుంది. జనాభా గణాంకాలను వెల్లడించకుండా రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 46ను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ వేశారు. దీని వల్ల బీసీల్లోని కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని, రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలని కోరారు. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ వేళ దీనిపై HC ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.

News November 27, 2025

HNK టౌన్‌హాల్‌కి శతాబ్దం.. శతవత్సరాల చారిత్రక సాక్ష్యం

image

వరంగల్ నగరంలో నిలిచిన హనుమకొండ టౌన్‌హాల్‌కు శతవత్సరం పూర్తైంది. 1924లో పునాదిరాయి వేసి ఏడో నిజాం చేతుల మీదుగా ప్రారంభమైన ఈ కట్టడం నేటికీ చారిత్రక ప్రతీకగా నిలుస్తోంది. ‘మహబూబ్ బాగ్’ పేరుతో 7 ఎకరాల్లో నిర్మించిన ఈ గార్డెన్‌కి అప్పట్లో రూ.2 లక్షలు మంజూరు చేశారు. ఒకప్పుడు చిన్న జూపార్క్‌గా ఉన్న ఇక్కడ.. నేరెళ్ల వేణుమాధవ్ ఆడిటోరియంతో సాంస్కృతిక కేంద్రంగా కొనసాగుతోంది.