News March 9, 2025

సిద్దిపేట: లోక్ అదాలత్‌లో 3073 కేసులు పరిష్కారం

image

జాతీయ మెగా లోక్ అదాలత్‌లో మొత్తం 3073 కేసులు పరిష్కరించినట్లు సిద్దిపేట సీపీ అనురాధ తెలిపారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న వివిధ పోలీసు స్టేషన్లలో నమోదై అండర్ ఇన్వెస్టిగేషన్, కోర్టు విచారణలో ఉన్న ఐపిసి కేసులు-307, డ్రంక్ అండ్ డ్రైవ్, MV Act యాక్ట్ కేసులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కేసులు-2747, ఈ-పెట్టి కేసులు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన కేసులు-19 పరిష్కరించినట్లు పేర్కొన్నారు.

Similar News

News November 20, 2025

కైకలూరు: ప్యాసింజర్ రైలు ఢీకొని వ్యక్తి మృతి

image

కైకలూరు సమీపంలో నర్సాపూర్ ప్యాసింజర్ రైలు ఢీకొని సుమారు 60 సంవత్సరాల వయసు గల గుర్తుతెలియని వ్యక్తి గురువారం మృతి చెందారు. మృతుడు తెలుపు రంగు టీషర్ట్, సిమెంట్ కలర్ ప్యాంట్ ధరించినట్లు భీమవరం రైల్వే జీఆర్‌పీ ఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపారు. వివరాలు తెలిసినవారు 9908448729 నంబర్‌కు తెలియజేయాలని కోరారు.

News November 20, 2025

కల్వకుర్తి: క్రీడలలో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు

image

చదువుతోపాటు క్రీడలలో రాణించే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా యువజన క్రీడల అధికారి సీతారాం నాయక్ అన్నారు. కల్వకుర్తి పట్టణ సమీపంలోని సీబీఎం కళాశాల ఆవరణలోని ఎంజెపీ పాఠశాలలో నిర్వహించిన కబడ్డీ క్రీడాకారుల ఎంపికలను గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలో క్రీడలను ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News November 20, 2025

అక్రమ కేసులతో కట్టడి చేయాలనుకుంటే పొరపాటే: వేముల

image

అక్రమ కేసులతో బీఆర్‌ఎస్, కేటీఆర్‌ను కట్టడి చేయాలనుకోవడం పొరపాటేనని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా, హామీలు అమలు చేసేవరకు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతుంటామని ఆయన స్పష్టం చేశారు.