News June 28, 2024
సిద్దిపేట: విశిష్ట ప్రతిభావంతులైన చేనేతలకు గుర్తింపు

ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని చేనేత రంగంలో విశిష్ట ప్రతిభ కనబరిచిన చేనేత కార్మికులకు కొండ లక్ష్మణ్ బాపూజీ పేరిట రాష్ట్రస్థాయి పురస్కారాలు ప్రధానం చేస్తామని జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి సంతోష్ ప్రకటించారు. చేనేత సహకార, సహకారేతర రంగంలో పనిచేస్తున్న కార్మికులు వచ్చే నెల 10 వ తేదీలోపు దరఖాస్తులను కలెక్టరేట్ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.
Similar News
News November 23, 2025
మెదక్: సత్యసాయి బాబాకు కలెక్టర్ నివాళులు

శ్రీ సత్యసాయి బాబా శత జయంతి సందర్భంగా మెదక్ కలెక్టరేట్లో కలెక్టర్ రాహుల్ రాజ్ నివాళులు అర్పించారు. సత్యసాయి చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యసాయి సేవా సమితి సేవలను కొనియాడారు. ఆయన చూపిన ప్రేమ, అహింస, సత్యం నేటి తరానికి ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య, సత్య సాయి సేవ సమితి మెదక్ జిల్లా అధ్యక్షుడు శిరిగా ప్రభాకర్, సాయిబాబా, శంకర్ గౌడ్, ప్రసన్న కుమారి ఉన్నారు.
News November 23, 2025
మెదక్: మోసాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: ఎస్పీ

ఫేక్ ట్రేడింగ్, ఫేక్ ఐపీఓలు, పార్ట్టైమ్ జాబ్ మోసాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ డీవీ శ్రీనివాస రావు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా వేగంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. చిన్న పొరపాట్లు కూడా పెద్ద ఆర్థిక నష్టాలకు దారితీసే అవకాశం ఉన్నందున ప్రజలు ఇంటర్నెట్, సోషల్ మీడియా, ఆన్లైన్ ట్రేడింగ్, బ్యాంకింగ్ సేవలను వినియోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.
News November 23, 2025
మెదక్: మోసాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: ఎస్పీ

ఫేక్ ట్రేడింగ్, ఫేక్ ఐపీఓలు, పార్ట్టైమ్ జాబ్ మోసాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ డీవీ శ్రీనివాస రావు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా వేగంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. చిన్న పొరపాట్లు కూడా పెద్ద ఆర్థిక నష్టాలకు దారితీసే అవకాశం ఉన్నందున ప్రజలు ఇంటర్నెట్, సోషల్ మీడియా, ఆన్లైన్ ట్రేడింగ్, బ్యాంకింగ్ సేవలను వినియోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.


