News March 23, 2025

సిద్దిపేట: వేడి నీటిలో పడ్డ చిన్నారి.. చికిత్స పొందుతూ మృతి

image

ప్రమాదవశాత్తు వేడి నీటిలో పడి, చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలో జరిగింది. పోలీసుల వివరాలు.. చెప్యాల గ్రామానికి చెందిన పుష్పాల శ్రీశైలం, రవళికి మూడు సంవత్సారాల కూతురు ఉంది. గత నెల 23వ తేదీన స్నానం చేయించడానికి వేడి నీరు పెట్టింది. సబ్బు కోసం రవళి ఇంట్లోకి వెళ్లగా చిన్నారి వేడి నీటిలో పడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందింది.

Similar News

News April 22, 2025

ఇంటర్ ఫలితాల్లో శివాని ప్రభంజనం

image

ఇంటర్మీడియట్ ఫలితాల్లో హన్మకొండ శివానీ జూనియర్ కాలేజీ ప్రభంజనం సృష్టించిందని కరస్పాండెంట్ టి.స్వామి పేర్కొన్నారు. MPC-IIలో సాయిజ, మాధవి 995, హాసిని 993(BIPC-II) & రిషిత, నవదీప్‌ 468(MPC-1), స్వాతి 435 (BIPC-1), CEC-Iలో కార్తీక్ 484 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో సత్తా చాటారని తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపల్స్‌తో కలిసి అభినందించారు.

News April 22, 2025

పార్వతీపురం: ‘ఈనెల 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు’

image

ఈ నెల 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారని DEO జ్యోతి మంగళవారం తెలిపారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఏప్రిల్ 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు అన్ని పాఠశాలలకు సెలవులు ఉంటాయన్నారు. వేసవి సెలవుల అనంతరం జూన్ 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయన్నారు.

News April 22, 2025

విశాఖ: రేపే పది ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో..!

image

రేపు ఉ.10 గంటలకు పదో తరగతి పరీక్షా ఫలితాలు ప్రకటించనున్నారు. విశాఖలో 29,997 మంది పరీక్ష రాయగా వారిలో 15,094 మంది బాలురు, 13,429 మంది బాలికలు ఉన్నారు. రెగ్యులర్ విద్యార్థులు 28,523 మంది, ఓపెన్ స్కూల్ 1,404 మంది, 2,124 వృత్తి విద్యా పరీక్ష రాశారు. 134 సెంటర్లలో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఒక్క క్లిక్‌తో వే2న్యూస్‌లో ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు. >Share it

error: Content is protected !!