News February 11, 2025
సిద్దిపేట: వేర్వేరుగా ముగ్గురు ఆత్మహత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739248553492_1243-normal-WIFI.webp)
సిద్దిపేట జిల్లాల్లో వేర్వేరుగా ముగ్గురు సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. కోహెడలో జీవితంపై విరక్తితో తిరుపతి రెడ్డి(50) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకోగా.. హుస్నాబాద్లో కుమార్తె ప్రేమ వివాహం చేసుకుందని రాజు(45) మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. గజ్వేల్ మండల పరిధిలో ఆర్థిక ఇబ్బందులతో రవీందర్(35) పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Similar News
News February 12, 2025
ADB వాసికి అంతర్జాతీయ అవార్డు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739278593347_20476851-normal-WIFI.webp)
అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవాల్లో భాగంగా ఉత్తమ డిస్క్రిప్షన్ డైరెక్టర్గా ADBకు చెందిన ప్రముఖ సినీ డైరెక్టర్ ఫహీం సర్కార్ అవార్డు అందుకున్నారు. మంగళవారం HYDలో జరిగిన చలనచిత్ర ఉత్సవంలో భాగంగా సినిమా, టీవీ రంగాల్లో పలు విభాగాలలో అందించిన అంతర్జాతీయ అవార్డుల పురస్కారంలో భాగంగా బెస్ట్ డిస్క్రిప్షన్ డైరెక్టర్ డైరెక్టర్గా ఫహీం సర్కార్ అవార్డు అందుకున్నారు.
News February 12, 2025
సిద్దిపేట: టెన్త్ అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739295424850_774-normal-WIFI.webp)
ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సంగారెడ్డి డివిజన్లో 25 , మెదక్ డివిజన్లో 24 గ్రామీణ్ డాక్ సేవక్(GDS) పోస్టులు ఉన్నాయి. దీనికి టెన్త్ అర్హత, వయసు 18-40ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్ లేదా బైక్ నడిపగలగాలి. టెన్త్లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మార్చి 3వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
News February 12, 2025
రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739295089796_1045-normal-WIFI.webp)
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లక్నో ప్రజాప్రతినిధుల కోర్టు తాజాగా సమన్లు జారీ చేసింది. భారత్ జోడో యాత్రలో ఆయన భారత సైన్యాన్ని అవమానపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ సరిహద్దు రోడ్ల సంస్థ మాజీ డైరెక్టర్ ఉదయ్ శంకర్ కేసు పెట్టారు. ఆ కేసు విచారణను స్వీకరించిన కోర్టు, వచ్చే నెల ఆఖరి వారంలో విచారణకు హాజరుకావాలని రాహుల్ని ఆదేశించింది.