News February 24, 2025

సిద్దిపేట: వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

image

వేర్వేరు ప్రమాదాల్లో డివైడర్‌ను ఢీకొని ముగ్గురు మృతి చెందారు. వివరాలు.. చిన్నకోడూర్ మండలం మల్లారం గ్రామ శివారులో ఆదివారం రాత్రి బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టడంతో బైక్‌పై ఉన్న ఛత్తీస్‌గఢ్‌కు రాష్ట్రానికి చెందిన ఉలేష్ కుమార్ (40) విష్ణు ఠాకూర్ (42) అక్కడికక్కడే మృతి చెందారు. కొండపాక మండలానికి చెందిన ఉదయ్ కుమార్ రెడ్డి(22) మండలంలోని సిర్సనగండ్ల శివారులో డివైడర్‌ను ఢీకొట్టడంతో మరణించాడు.

Similar News

News November 4, 2025

తగ్గిన బంగారం, వెండి ధరలు

image

బంగారం ధరలు స్వల్పంగా తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.710 తగ్గి రూ.1,22,460కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 650 పతనమై రూ.1,12,250 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.3000 తగ్గి రూ.1,65,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News November 4, 2025

కాకినాడ రూరల్‌లో వాళ్లదే సెటిల్మెంట్ల హవా!

image

కాకినాడ రూరల్‌‌లో కొందరు నాయకులు సెటిల్మెంట్లు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కరపలో ఓ నాయకుడు ‘ఛైర్మన్’ పేరుతో పేకాట శిబిరాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. పోలీస్‌, రెవెన్యూ విభాగాలను ఇతరులకు అప్పగించారని, లేఔట్లు, సెటిల్‌మెంట్లు ఎమ్మెల్యే బంధువు చూస్తున్నారనే టాక్ నడుస్తోంది. గతంలో పవన్‌ కళ్యాణ్ ఎమ్మెల్యేను పిలిచి మందలించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలసిందే.

News November 4, 2025

కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుందని..

image

TG: కూతురు లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఇష్టంలేని కుటుంబసభ్యులు అబ్బాయి ఇంటికి నిప్పు పెట్టిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఝరాసంగం మం. కక్కర్‌వాడలోని విఠల్ కూతురు, అదే గ్రామానికి చెందిన రాధాకృష్ణ ప్రేమించుకున్నారు. పెళ్లికి కుటుంబసభ్యులు ఒప్పుకోకపోవడంతో ఆమె లవ్ మ్యారేజ్ చేసుకుంది. దీంతో విఠల్ ఆగ్రహంతో ఊగిపోయాడు. కుమారుడు పాండుతో కలిసి రాధాకృష్ణ తండ్రిపై ఘోరంగా దాడి చేసి, ఇంటికి నిప్పు పెట్టారు.