News February 24, 2025

సిద్దిపేట: వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

image

వేర్వేరు ప్రమాదాల్లో డివైడర్‌ను ఢీకొని ముగ్గురు మృతి చెందారు. వివరాలు.. చిన్నకోడూర్ మండలం మల్లారం గ్రామ శివారులో ఆదివారం రాత్రి బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టడంతో బైక్‌పై ఉన్న ఛత్తీస్‌గఢ్‌కు రాష్ట్రానికి చెందిన ఉలేష్ కుమార్ (40) విష్ణు ఠాకూర్ (42) అక్కడికక్కడే మృతి చెందారు. కొండపాక మండలానికి చెందిన ఉదయ్ కుమార్ రెడ్డి(22) మండలంలోని సిర్సనగండ్ల శివారులో డివైడర్‌ను ఢీకొట్టడంతో మరణించాడు.

Similar News

News January 9, 2026

HNK: టెన్త్ విద్యార్థులకు అల్పాహార నిధులు విడుదల!

image

పదో తరగతి ప్రత్యేక తరగతులకు హాజరయ్యే ప్రభుత్వ, జడ్పీ, ఆదర్శ పాఠశాలల విద్యార్థుల కోసం రాష్ట్ర సమగ్రశిక్ష విభాగం అల్పాహార నిధులు మంజూరు చేసింది. ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15 చొప్పున, ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10 వరకు (19 రోజులకు) ఈ అల్పాహార ఖర్చులు మంజూరు చేశారు. దీంతో వరంగల్‌లో 2,768 మందికి రూ.7.88 లక్షలు,
​హనుమకొండలో 2,491 మందికి రూ.7.09 లక్షల నిధులు మంజూరయ్యాయి.

News January 9, 2026

‘భూ భారతి’.. మీసేవ, స్లాట్ బుకింగ్ కేంద్రాల్లో అక్రమాలు!

image

TG: ‘భూ భారతి’ పోర్టల్ ద్వారా కొందరు మీసేవ, స్లాట్ బుకింగ్ కేంద్రాల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో కొంత ప్రభుత్వానికి జమ చేసి మిగతా నగదును పర్సనల్ ఖాతాల్లోకి మళ్లించుకున్నట్లు తేల్చారు. జనగామలో ఒక్కరోజే ₹8L తేడాను గుర్తించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అవకతవకలు జరిగాయేమోననే ఆందోళన వ్యక్తమవుతోంది.

News January 9, 2026

నరసరావుపేటలో ఐపీ కలకలం.. ప్రముఖ వాహన డీలర్ దివాలా!

image

నరసరావుపేటలో ప్రముఖ ద్విచక్ర వాహన డీలర్ ఎర్రంశెట్టి సోదరులు దివాలా పిటిషన్ దాఖలు చేయడం స్థానికంగా కలకలం రేపింది. రూ.60 కోట్ల మేర బకాయిలు చెల్లించలేక, వ్యాపార నష్టాల సాకుతో వీరు కోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘకాలంగా నమ్మకమైన వ్యాపారులుగా పేరున్న వీరు ఒక్కసారిగా IP నోటీసులు పంపడంతో బాధితులు దిగ్భ్రాంతికి గురయ్యారు. భారీ మొత్తంలో డబ్బులిచ్చిన వారు తమ పెట్టుబడి ఏమవుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.