News March 5, 2025

సిద్దిపేట: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

సిద్దిపేట త్రీ టౌన్ పీఎస్ పరిధిలోని ఏన్సాన్ పల్లి గ్రామ శివారులో ఓ ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. గ్రామానికి చెందిన ఓ ఇంటిలో మహిళలను తెచ్చి వ్యభిచారం చేయిస్తున్నారన్న సమాచారంతో దాడి చేశారు. ఈ దాడిలో ఓ మహిళ, రూ.1700 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News November 23, 2025

జనగామ: నేడే ఎన్ఎంఎంఎస్ పరీక్ష..!

image

కేంద్ర ప్రభుత్వం 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు అందించే రూ.12 వేల ఉపకార వేతనానికి సంబంధించిన నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష ఆదివారం జరగనుంది. ఇందుకు జనగామ జిల్లాలో 4 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 729 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. పర్యవేక్షణకు నలుగురు చీఫ్ సూపరింటెండెంట్ లు, నలుగురు డిపార్ట్మెంట్ ఆఫీసర్లను, 40 మంది ఇన్విజిలేటర్లను నియమించారు.

News November 23, 2025

అచ్చంపేట: యువకుడిపై పోక్సో కేసు నమోదు

image

అచ్చంపేట మున్సిపాలిటీ పరిధికి చెందిన బాలికపై అదే ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల యువకుడు అఘాయిత్యం చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు శుక్రవారం రాత్రి అచ్చంపేట ఎస్సై సద్దాం హుస్సేన్ కేసు నమోదు చేశారు. నిందితుడిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి, కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.

News November 23, 2025

చిలకపాలెం-రాయగడ రోడ్డు పనులకు రేపు శంకుస్థాపన

image

చిలకపాలెం-రామభద్రపురం-రాయగడ రోడ్డు పనులకు ఎమ్మెల్యే బేబినాయన, బుడా చైర్మన్ తెంటు రాజా సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. రోడ్డు పూర్తిగా పాడైపోవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రోడ్డుకు నిధులు మంజూరు చేయాలని అసెంబ్లీలో బేబినాయన కోరడంతో రూ.4.50కోట్లు మంజూరయ్యాయి. గొర్లెసీతారాంపురం వద్ద శంకుస్థాపన చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.