News April 4, 2025
సిద్దిపేట: ‘సమగ్ర ప్రణాళికతో వరి కొనుగోళ్లు జరపాలి’

యాసంగి 2024-25 సంబంధించిన వరి ధాన్యం సేకరణ ప్రక్రియను ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా సాఫీగా నిర్వహించేందుకు గాను సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ అబ్దుల్ హమీద్ ఆదేశించారు. జిల్లాలోని వరిధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వహకులకు, మండల వ్యవసాయ & వ్యవసాయ విస్తరణ అధికారులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.
Similar News
News December 1, 2025
మీది పొడిచర్మమా? అయితే ఇలా చేయండి

బాడీలో సెబాషియన్ గ్రంధుల ద్వారా కొన్ని జిడ్డు పదార్థాలు తక్కువగా ప్రొడ్యూస్ అయినపుడు చర్మం పొడిగా, నిర్జీవంగా ఉంటుంది. దాన్నే డ్రై స్కిన్ టైప్ అంటున్నారు నిపుణులు. ఈ టైప్ స్కిన్కి ఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువ. ఇన్ఫెక్షన్లు సోకితే ముక్కు, కనుబొమ్మల చుట్టూ దద్దుర్లు వస్తాయి. ఈ స్కిన్ టైప్ వారు సున్నితమైన క్లెన్సర్&హ్యూమెక్టెంట్స్ ఉండే మాయిశ్చరైజర్ని ఎంచుకుంటే చర్మం తేమగా, తాజాగా ఉంటుందంటున్నారు.
News December 1, 2025
అర్జీల పరిష్కారం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: కలెక్టర్

పీజీఆర్ఎస్ కార్యక్రమానికి ప్రజలు అందిస్తున్న అర్జీల పరిష్కారం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై చర్యలు చేపడతామని కలెక్టర్ మహేశ్ కుమార్ హెచ్చరించారు. సోమవారం అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆయన పీజీఆర్ఎస్ను నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, మొత్తం 135 అర్జీలను స్వీకరించారు.
News December 1, 2025
దూడల్లో నట్టల బెడద – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

దూడలకు నట్టల బెడద సర్వసాధారణం. ఈ సమస్య గేదె దూడలలో ఎక్కువగా వస్తుంది. దూడల్లో నట్టల సమస్య ఉంటే వాటికి తరచూ విరేచనాలు అయ్యి దూడ పెరుగుదల సక్రమంగా ఉండదు. వెంట్రుకలు బిరుసుగా ఉండి, నడుము కిందికి జారి ఉంటుంది. దవడల మధ్య నీరు చేరుతుంది. ఈ సమస్య కట్టడికి దూడ పుట్టిన ఎనిమిది రోజులలో తొలిసారి, తర్వాత ప్రతి నెలకు ఒకసారి చొప్పున ఆరు నెలల వయసు వచ్చేవరకు వెటర్నరీ నిపుణుల సూచనలతో నట్టల మందు తాగించాలి.


