News March 11, 2025
సిద్దిపేట: సమస్యలను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తమ సమస్యలను జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్తో కలిసి జిల్లా కలెక్టర్ వినతులను స్వీకరించారు. మొత్తం 54 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News October 25, 2025
శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ పిక్నిక్ ప్రదేశాలు ఇవే..

శ్రీకాకుళం జిల్లాలో కార్తీక వనభోజనాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నాలుగు ఆదివారాలు కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి పిక్నిక్లు జరుపుకోనున్నారు. మన జిల్లాలో వంశధారా, నాగావళి నదీ తీరాలు, కలింగపట్నం, బౌద్ధ శిల్పాలు, బారువా బీచ్, టెలినీలపురం, మణిభద్రపురం కొండప్రాంతాలు పిక్నిక్ జరుపుకొనే ప్రాంతాలుగా ప్రసిద్ధి పొందినవి. మరి మీరు ఎక్కడికి వెళ్తున్నారో కామెంట్ చేయండి.
News October 25, 2025
జగనామ జిల్లాలో కాకతీయ అనంతర శైలి శిల్పాలు!

జగనామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామ దేవతా ఆలయ రిజర్వాయర్ వద్ద రాష్ట్రకూట, కాకతీయ అనంతర శైలికి చెందిన నాగుల శిల్పాలు, శిథిల శిల్పాలు బయటపడ్డాయి. ఇక్కడ శివలింగం పట్టుకున్న వీరుడు, నక్క వాహనం కలిగిన శిథిల చాముండి శిల్పం కూడా ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. మీ గ్రామంలో కూడా ఇలా చరిత్ర కలిగిన దేవాలయాలు, శిల్పాలు ఉంటే కామెంట్ చేయండి.
News October 25, 2025
విశాఖ: చెంబులో డబ్బులేస్తే రెట్టింపు అవుతాయని మోసం

తమ వద్ద ఉన్న రూ.30 కోట్ల విలువైన చెంబులో డబ్బులు వేస్తే రెట్టింపు అవుతాయని డాక్టర్ను మోసగించిన కేటుగాళ్లను ఆరిలోవ పోలీసులు అరెస్టు చేశారు. HYDకి చెందిన డా. ప్రియాంక వద్ద రైస్ పుల్లింగ్ పేరుతో అరకు చెందిన కొర్రా బంగార్రాజు, పెందుర్తికి చెందిన వనుము శ్రీనివాస్ రూ.1.70కోట్లు కాజేశారు. 6 నెలలైనా వారి నుంచి స్పందన లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించగా వారిని అరెస్టు చేశామని ACP నరసింహమూర్తి తెలిపారు.


