News February 27, 2025
సిద్దిపేట: ‘సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి’

జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో ఈ నెల 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, సైన్స్ సెమినార్, సైన్స్ పుస్తక ప్రదర్శన, సైన్స్ పరికరాలు, సైన్స్ ప్రయోగాలు, సైన్స్ అభ్యసన సామాగ్రి, ప్రాజెక్టుల ప్రదర్శన నిర్వహించాలని పేర్కొన్నారు.
Similar News
News November 17, 2025
ASF: వడ్డీ వ్యాపారులకు చిరు వ్యాపారులే టార్గెట్

ASF జిల్లాలో ఫైనాన్స్ పేరుతో వడ్డీ వ్యాపారులు పేదలను తీవ్రంగా దోపిడీ చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అధిక వడ్డీలు విధించి చిన్న వ్యాపారుల నడ్డి విరుస్తున్నారు. కట్టలేకపోతే బెదిరింపులు, గొడవలు రోజువారీగా మారాయి. అనుమతులు లేకుండా రూ.కోట్ల లావాదేవీలు జరిపినా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు ఆర్థికంగా నలిగిపోతున్నారు. గతంలో వడ్డీ వ్యాపారులపై దాడులు కూడా జరిగిన వారి దందా మాత్రం ఆగడం లేదు.
News November 17, 2025
ఖమ్మం టీహబ్లో సాంకేతిక సమస్యలు!

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని తెలంగాణ హబ్(టీహబ్) ద్వారా 6.5 లక్షల మంది రోగులకు 127 రకాల ఉచిత పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. కోటిన్నర విలువైన యంత్రాలు తరచుగా మొరాయిస్తుండటంతో, రోగ నిర్ధారణ పరీక్షలు నిలిచిపోయి చికిత్సలకు అంతరాయం ఏర్పడుతోంది. ప్రభుత్వం వెంటనే పాత యంత్రాల స్థానంలో కొత్త మిషన్లను అందుబాటులోకి తీసుకురావాలని రోగులు కోరుతున్నారు.
News November 17, 2025
ఖమ్మం: కూలీల కొరత.. పత్తి రైతులకు కష్టాలు

పెట్టుబడి పెట్టి పండించిన పత్తి పంట చేతికొచ్చే సమయంలో రైతులకు కూలీల కొరత తీవ్రంగా వేధిస్తోంది. వరి కోతల కారణంగా కూలీలు అటువైపు మళ్లుతుండటంతో, పత్తి కళ్లముందే ఎండిపోతోందని అన్నదాతలు మనోవేదనకు గురవుతున్నారు. ఒకవేళ కూలీలు దొరికినా, వారు కిలో పత్తికి రూ.15 నుంచి రూ.20 వరకు అధిక మొత్తంలో అడుగుతున్నారు. దీంతో పత్తి తీసిన ఖర్చులకే సరిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


