News February 27, 2025
సిద్దిపేట: ‘సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి’

జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో ఈ నెల 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, సైన్స్ సెమినార్, సైన్స్ పుస్తక ప్రదర్శన, సైన్స్ పరికరాలు, సైన్స్ ప్రయోగాలు, సైన్స్ అభ్యసన సామాగ్రి, ప్రాజెక్టుల ప్రదర్శన నిర్వహించాలని పేర్కొన్నారు.
Similar News
News July 8, 2025
యాప్స్లో మోసం.. నాలుగింతలు వసూలు!

రైడ్ పూలింగ్ యాప్స్ల దోపిడీపై ఓ మహిళ చేసిన ట్వీట్ వైరలవుతోంది. బెంగళూరుకు చెందిన మహిళ 2.6kms వెళ్లేందుకు ఆటో బుక్ చేయగా రూ.172.45 చూపించింది. అదే దూరానికి డైరెక్ట్గా ఆటోలో వెళ్తే రూ.39 ఛార్జీని తీసుకున్నట్లు ఆమె ట్వీట్ చేశారు. దీంతో యాప్స్లో జరుగుతున్న మోసాలపై చర్చ మొదలైంది. Ola, Rapido, Uber వంటి యాప్స్లో స్కామ్స్ జరుగుతున్నాయని, తామూ ఈ వ్యత్యాసాన్ని గమనించినట్లు పలువురు చెబుతున్నారు.
News July 8, 2025
కామవరపుకోట: బస్సు ఢీకొని ఒకరు మృతి

కామవరపుకోట మండలం తడికలపూడి శ్రీనివాస వేబ్రిడ్జి వద్ద మంగళవారం జరిగిన యాక్సిడెంలో ఒకరు మృతి చెందారు. ఓ ప్రైవేటు బస్సు ఢీకొనడంతో ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
News July 8, 2025
భూపాలపల్లి: జిల్లా వ్యాప్తంగా 35.6 మి.మీ వర్షపాతం

గడిచిన 24 గంటలలో భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 35.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మండలాల వారిగా చూస్తే మహాదేవపూర్ 3.8 మి.మీ, పలిమెల 3.0 మి.మీ, మహముత్తారం 10.4 మి.మీ, కాటారం 3.8 మి.మీ, మల్హర్ 8.6 మి.మీ రేగొండ 2.6 మి.మీ, భూపాలపల్లి 3.4 మి.మీగా నమోదైంది.