News May 3, 2024

సిద్దిపేట: సైబర్ వలకు చిక్కిన మహిళ

image

సిద్దిపేటకు చెందిన ఓ మహిళ సైబర్ నేరగాడి చేతిలో మోసపోయింది. సీపీ తెలిపిన వివరాలు.. ఓ వ్యక్తి ఫోన్ చేసి ఓ ప్రముఖ కంపెనీలో బ్యాక్ డోర్ జాబ్స్ ఉన్నాయని చెప్పగానే నమ్మిన మహిళ నిందితుడు చెప్పిన విధంగా గూగుల్ పే, ఫోన్ పే ద్వారా విడతలుగా రూ.16,75,750 పంపించింది. అనంతరం ఆ నంబర్ స్విచ్ ఆఫ్ కావడంతో మోసపోయానని గ్రహించిన ఆమె వెంటనే 1930కి ఫిర్యాదు చేసినట్లు సీపీ తెలిపారు.

Similar News

News December 8, 2025

మెదక్: రూ.15 లక్షల విలువైన 110 మొబైల్ ఫోన్ల రికవరీ: ఎస్పీ

image

CEIR పోర్టల్ ద్వారా రూ.15 లక్షల విలువైన 110 మొబైల్ ఫోన్ల రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు పోగొట్టుకున్న 1,734 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని బాధితులకు అందించామని వివరించారు. కోల్పోయిన ఫోన్లు తిరిగి రావడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తూ జిల్లా పోలీస్ శాఖకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మహేందర్ పాల్గొన్నారు.

News December 8, 2025

కుకుట్లపల్లిలో అన్నదమ్ముల మధ్య సవాల్

image

కౌడిపల్లి మండలంలో కూకట్లపల్లి పంచాయతీలో సొంత అన్నదమ్ముల మధ్య పోరు జరుగుతోంది. ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ కావడంతో సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ మద్దతుదారుగా నీరుడి అశోక్ బరిలో నిలవగా అతని తమ్ముడు నీరుడి కుమార్ భారాస మద్దతుతో పోటీలో ఉన్నారు. రెండు ప్రధాన పార్టీలు వారికి మద్దతు తెలపడంతో అన్నాదమ్ముల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. ఓటర్లు ఎవరిని ఆదరిస్తారో చూడాలి మరి.

News December 8, 2025

మెదక్: రెండో విడతలో ఏడు పంచాయతీలు ఏకగ్రీవం

image

మెదక్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఏడు సర్పంచి స్థానాలు, 254 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 8 మండలాల్లో 142 సర్పంచి, 1,035 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచి పదవులు ఏకగ్రీవమైన వాటిలో వెల్దుర్తి మండలం షౌకత్ పల్లి, నగరం, బస్వాపూర్, మెదక్ మండలం మల్కాపూర్ తండా, చిన్న శంకరంపేట మండలం మాందాపూర్ తండా, గవలపల్లి తండా, సంగాయపల్లి ఏకగ్రీవం అయ్యియి.