News April 14, 2025

సిద్దిపేట: సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టవద్దు: సీపీ

image

సోషల్ మీడియాలో విద్వేషకర, తప్పుడు పోస్టులు, మార్ఫింగ్ చేసి ఫోటోలు, రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ హెచ్చరించారు. IT చట్ట ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలు, యువకులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు SMలో తప్పుడు పోస్టులు పెట్టవద్దన్నారు.

Similar News

News April 24, 2025

SRH ఘోర ఓటమి

image

IPLలో SRH ఓటముల పరంపర కొనసాగుతోంది. ఇవాళ ఉప్పల్‌లో ముంబైతో జరిగిన మ్యాచులో 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 144 పరుగుల టార్గెట్‌ను ముంబై 15.4 ఓవర్లలోనే ఛేదించింది. రోహిత్ శర్మ 70 రన్స్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. సూర్య 40*, జాక్స్ 22 రన్స్ చేశారు. ఈ ఓటమితో SRH ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపు గల్లంతు కాగా ముంబైకి ఇది వరుసగా నాలుగో విజయం.

News April 24, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు!!

image

✔ఉగ్రవాద దుశ్చర్యలను ఖండించిన ఏబీవీపీ
✔NGKL: 60 రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలు
✔కొల్లాపూర్‌లో BRS నాయకుడిపై దాడి
✔ఈత సరదా విషాదం కాకూడదు:SPలు
✔భూభారతి చట్టంపై రైతులకు అవగాహన
✔పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
✔వనపర్తి:Way2Newsతో జిహెచ్ఎం ఉమాదేవి
✔కొనసాగుతున్న ఓపెన్ SSC,INTER పరీక్షలు
✔వేసవిలో జాగ్రత్త…’Way2news’తో ఉపాధ్యాయులు
✔ప్రోగ్రెస్ కార్డుల పంపిణీ.. విద్యార్థుల సందడి

News April 23, 2025

పాత బెడ్‌పై నిద్రిస్తున్నారా?

image

మనం పడుకునే బెడ్ కూడా నిద్రను ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏడేళ్లకు మించి ఒకే పరుపును ఉపయోగించడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. పాత బెడ్‌పై నిద్రిస్తే చేతులు, కాళ్ల నొప్పులతోపాటు నిద్రలేమి సమస్య వెంటాడుతుంది. వెన్నునొప్పి సమస్యకు దారితీస్తుంది. పరుపుల తయారీలో వాడే నాఫ్తలీన్, బెంజీన్ వంటి వాటి వల్ల అలర్జీ, దురద, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదముంది. 2-3 ఏళ్లకోసారి బెడ్స్‌ను మార్చడం బెటర్.

error: Content is protected !!