News February 26, 2025

సిద్దిపేట: 10 రోజుల్లో పెళ్లి.. మహిళా కానిస్టేబుల్ సూసైడ్

image

మహిళా కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన యాదాద్రి జిల్లాలో మంగళవారం జరిగింది. సిద్దిపేట కోహెడ మండలం వరికోలుకు చెందిన అనూష భువనగిరిలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కుటుంబీకులు ఇష్టంలేని పెళ్లి చేస్తుండడంతో ఆమె సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అనూషకు ఈనెల 14న నిశ్చితార్థం కాగా మార్చి 6న పెళ్లి జరగనుంది. ఈ క్రమంలో అనూష అద్దెకు ఉంటున్న ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Similar News

News December 2, 2025

ADB: మరోసారి అవకాశం కల్పిస్తా ఈసారికి ఆగు..!

image

పంచాయతీ ఎన్నికల్లో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే తొలి విడత నామినేషన్ల స్వీకరణ పూర్తి కాగా రెండో విడత కొనసాగుతోంది. ఈసారి తమకు అనుకూలంగా రిజర్వేషన్ రావడంతో ఒకే వర్గానికి చెందిన పలువురు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. దీంతో ఒకరినొకరు బుజ్జగిస్తున్నారు. నామినేషన్లు వెనక్కి తీసుకునేలా ఒత్తిడి చేస్తున్నారు. మరోసారి నీకు అవకాశం కల్పిస్తా ఈసారికి ఆగు అన్నట్లు మాట్లాడుతున్నారు.

News December 2, 2025

ఎంపీ ఉదయ్‌కి సెకండ్ ర్యాంక్

image

ఆంధ్రప్రదేశ్ ఎంపీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిలో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ రెండో స్థానంలో నిలిచారు. పూణేకు చెందిన సెంటర్ ఫర్ పబ్లిక్ ఒపీనియన్ అండ్ సెఫలాజికల్ స్టడీ వారు నిర్వహించిన సర్వేలో ఆయన ఈ స్థానాన్ని దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 25 మంది ఎంపీలపై చేసిన ఈ సర్వేలో ఉదయ్ శ్రీనివాస్ 8.6 స్కోరు సాధించి, బెస్ట్ పర్ఫామెన్స్ చూపారు.

News December 2, 2025

ఈ సారి చలి ఎక్కువే: IMD

image

దేశంలో ఈ శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. మధ్య, వాయవ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు ఎక్కువగా వీస్తాయని అంచనా వేసింది. హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో 4-5 రోజులు ఎక్కువగా కోల్డ్ వేవ్స్ ఉంటాయని చెప్పింది. కాగా దేశంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది.