News February 26, 2025
సిద్దిపేట: 10 రోజుల్లో పెళ్లి.. మహిళా కానిస్టేబుల్ సూసైడ్

మహిళా కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన యాదాద్రి జిల్లాలో మంగళవారం జరిగింది. సిద్దిపేట కోహెడ మండలం వరికోలుకు చెందిన అనూష భువనగిరిలో ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. కుటుంబీకులు ఇష్టంలేని పెళ్లి చేస్తుండడంతో ఆమె సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అనూషకు ఈనెల 14న నిశ్చితార్థం కాగా మార్చి 6న పెళ్లి జరగనుంది. ఈ క్రమంలో అనూష అద్దెకు ఉంటున్న ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Similar News
News October 25, 2025
ములుగు: బడి తప్పియ్యని పంతులుకు పురస్కారం..!

ఉపాధ్యాయుల హాజరు శాతం నమోదు కోసం ప్రవేశపెట్టిన ఫేషియల్ రికగ్నిషన్ సిస్టంలో జంగాలపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు రాసమల్ల కృష్ణమూర్తి అత్యధిక హాజరు శాతాన్ని నమోదు చేశారు. ఈ విధానం అమలులోకి వచ్చిన 38 రోజుల్లో 36 రోజులు ఆయన పాఠశాలకు వచ్చారు. ఇలా రాష్ట్రంలో ముగ్గురు మాత్రమే ఉండగా.. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో కృష్ణమూర్తిని ఉన్నతాధికారులు సత్కరించారు. డీఈవో సిద్దార్థ్ రెడ్డి అభినందించారు.
News October 25, 2025
ఎస్ఐఆర్ ఓటర్ జాబితా పకడ్బందీగా తయారు చేయాలి: ఎన్నికల అధికారి

ఎస్.ఐ.ఆర్. (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఓటర్ జాబితా పకడ్బందీగా తయారు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ పాల్గొన్నారు.
News October 25, 2025
ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకానికి CBN శ్రీకారం

AP: ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏపీఎన్ఆర్టీ సొసైటీ ద్వారా బీమా పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ స్కీమ్ను CM CBN దుబాయ్లో ప్రారంభించారు. ‘ఉద్యోగులు, విద్యార్థులు, వలస కార్మికులకు ఇది ప్రయోజనం అందిస్తుంది. బీమా వ్యక్తి ప్రమాదంలో మరణించినా, అంగవైకల్యం పొందినా ₹10 లక్షలు అందుతుంది. ఈ పథకంలో నమోదు కావడానికి ‘https://apnrts.ap.gov.in/insurance’ వెబ్ సైట్ను సందర్శించాలి’ అని I&PR సూచించింది.


