News February 9, 2025
సిద్దిపేట: 10 రోజుల వ్యవధిలోనే నలుగురి మృతి

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో <<15400876>>పది రోజుల క్రితం<<>> జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్దిపేటకు చెందిన భార్యాభర్తలు ఆకుల కనకయ్య, తార మృతి చెందిన విషయం తెలిసిందే. అదే ప్రమాదంలో వారి కుమారుడు ఆకుల శ్రీనివాస్ తీవ్ర గాయాలతో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 12 రోజుల వ్యవధిలో ఓ వైపు తండ్రి, అత్తామామ, భర్త మృతితో సృజన రోదనలు మిన్నంటాయి. వారి మరణంతో బంధువులు శోకసముద్రంలో మునిగారు.
Similar News
News November 11, 2025
జగిత్యాల జిల్లా దిశా కమిటీ సమావేశంలో ఎంపీ అరవింద్

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో దిశా కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఇందులో చైర్మన్ హోదాలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొని కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, వాటి పనితీరుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జగిత్యాల MLA డా.సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, అడిషనల్ కలెక్టర్లు బీఎస్.లత, రాజ గౌడ్, దిశా కమిటీ సభ్యులు, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
News November 11, 2025
NGKL: ‘పీఎం ధాన్ ధాన్య కృషి యోజన అమలు పక్కాగా చేయాలి’

నాగర్కర్నూల్ జిల్లాలో రానున్న ఆరేళ్లపాటు పంట ఉత్పాదకత పెంచడం, పంటల మార్పిడి, సుస్థిర వ్యవసాయ విధానాలను ప్రోత్సహించే విధంగా ప్రధానమంత్రి ధాన్ ధాన్య కృషి యోజన అమలుకు సమగ్ర కార్యాచరణ వార్షిక ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. మంగళవారం అదనపు కలెక్టర్ దేవ సహాయంతో కలిసి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ, పశుసంవర్ధక తదితర శాఖల పనితీరును అడిగి తెలుసుకున్నారు.
News November 11, 2025
ఢిల్లీ పేలుడు.. రూ.10 లక్షల పరిహారం

ఢిల్లీలో జరిగిన పేలుడులో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని సీఎం రేఖా గుప్తా ప్రకటించారు. శాశ్వతంగా వికలాంగులైన వారికి రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు అందిస్తామన్నారు. గాయపడిన వారికి నాణ్యమైన చికిత్సను అందిస్తామని చెప్పారు. ఢిల్లీ శాంతిభద్రతలు తమ బాధ్యత అని పేర్కొన్నారు.


