News February 9, 2025

సిద్దిపేట: 10 రోజుల వ్యవధిలోనే నలుగురి మృతి

image

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో <<15400876>>పది రోజుల క్రితం<<>> జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్దిపేటకు చెందిన భార్యాభర్తలు ఆకుల కనకయ్య, తార మృతి చెందిన విషయం తెలిసిందే. అదే ప్రమాదంలో వారి కుమారుడు ఆకుల శ్రీనివాస్ తీవ్ర గాయాలతో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 12 రోజుల వ్యవధిలో ఓ వైపు తండ్రి, అత్తామామ, భర్త మృతితో సృజన రోదనలు మిన్నంటాయి. వారి మరణంతో బంధువులు శోకసముద్రంలో మునిగారు.

Similar News

News November 4, 2025

అమరావతి విజన్ రూపకల్పనలో భాగస్వామ్యం కావాలని CRDA పిలుపు

image

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భవిష్యత్తు విజన్ రూపకల్పనలో మీరు కూడా భాగస్వాములవ్వాలని CRDA కోరుతుంది. అభిప్రాయాన్ని నమోదు చేసేందుకు ఈ లింక్‌ను క్లిక్ చేసి లేదా QR కోడ్‌ను స్కాన్ చేయాలని లింక్ https://tinyurl.com/4razy6ku రూపొందించింది. అమరావతి ప్రాంత అభివృద్ధికి విజన్ 2047 రూపొందించడంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చింది.

News November 4, 2025

హోంగార్డు కుటుంబానికి అండగా ఉంటాం: SP

image

హోంగార్డు సి‌హెచ్. శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడు అండగా ఉంటామని ఎస్పీ కె.నారాయణ రెడ్డి తెలిపారు. నేడు వికారాబాద్ పోలీస్ కార్యలయంలోని MT సెక్షన్లో విధులు నిర్వహిస్తూ, అకాల మరణం చెందిన హోం గార్డ్ సి‌హెచ్.శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ఎస్పీ పరామర్శించి, వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. శ్రీనివాస్ హఠాన్మరణం తీవ్రంగా కలచి వేసిందని పేర్కొన్నారు.

News November 4, 2025

సోమల: ముళ్ల పొదలలో నవజాత శిశువు

image

అప్పుడే పుట్టిన నవజాత శిశువును ముళ్ల పోదలలో గుర్తు తెలియని వ్యక్తులు పడవేసిన ఘటన సోమల మండలంలో మంగళవారం వెలుగు చూసింది. ఎస్ నడింపల్లి సమీపంలో శిశువును గుర్తించిన స్థానికులు సోమల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స ఇచ్చిన తరువాత ఐసీడీఎస్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు చిన్నారిని అంబులెన్స్‌లో చిత్తూరు శిశు విహార్‌కు తరలించారు.