News February 9, 2025

సిద్దిపేట: 10 రోజుల వ్యవధిలో నలుగురి మృతి

image

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో పది రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్దిపేటకు చెందిన భార్యాభర్తలు ఆకుల కనకయ్య, తార మృతి చెందిన విషయం తెలిసిందే. అదే ప్రమాదంలో వారి కుమారుడు ఆకుల శ్రీనివాస్ తీవ్ర గాయాలతో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 12 రోజుల వ్యవధిలో ఓ వైపు తండ్రి, అత్తామామ, భర్త మృతితో సృజన రోదనలు మిన్నంటాయి. వారి మరణంతో బంధువులు శోకసముద్రంలో మునిగారు.

Similar News

News February 12, 2026

మెదక్ జిల్లాలో 4 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు

image

మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. జిల్లాలోని 4 మున్సిపాలిటీలకు వేర్వేరుగా లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్‌లో గోల్డ్ బంగ్లా వెస్లీ కళాశాల, నర్సాపూర్‌లో BVRIT, తూప్రాన్‌లో నోబుల్ ఫార్మా కళాశాల, రామాయంపేటలో ఎంపీడీవో కార్యాలయంలో ఓట్ల లెక్కింపు జరగనుంది. రేపు ఉదయం నుండే ఈ ప్రక్రియ ప్రారంభం కానుండటంతో ఏర్పాట్లు పూర్తి చేశారు.

News February 12, 2026

MDK: ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి నేడు OD

image

నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు కలెక్టర్ ఆదేశాల మేరకు నేడు ఓడీ సౌకర్యం కల్పిస్తున్నట్లు MDK జిల్లా విద్యాధికారి విజయ తెలిపారు. విధుల్లో ఆలస్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే, కౌంటింగ్ ట్రైనింగ్ ఉన్న సిబ్బంది మాత్రం తప్పనిసరిగా శిక్షణకు హాజరు కావాలని సూచించారు. పాఠశాలల నిర్వహణకు ఆటంకం కలగకుండా హెచ్‌ఎంలు, ఎంఈఓలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

News February 12, 2026

మెదక్: ఓటు వేసేందుకు రాష్ట్రం దాటాడు

image

ఓటుపై తనకున్న బాధ్యతను చాటుకున్నాడో యువకుడు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మెదక్ పట్టణంలోని 22వ వార్డుకు చెందిన రవితేజ(26) ఏపీలోని తెనాలి నుంచి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అక్కడ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రవితేజ, తన విలువైన ఓటును వేసేందుకు రాష్ట్రం దాటి సొంతూరికి చేరుకున్నాడు. ఈ యువకుడి చొరవను పలువురు అభినందించారు.