News January 29, 2025
సిద్దిపేట: 100 శాతం పన్నులు వసూలు చేయాలి: అదనపు కలెక్టర్

సిద్దిపేట జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో 100 శాతం పన్నులు వసూలు చేయాలని అధికారులను అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ మున్సిపల్ ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ఇతర సిబ్బందితో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అన్ని మున్సిపాలిటీల్లో ప్రాపర్టీ టాక్స్, షాప్ రెంట్స్, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు వసూలు చేయలన్నారు. ఆయా మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
Similar News
News January 9, 2026
అభ్యంతరాలు ఉంటే జాతర తర్వాత కూడా మార్పులు: సీతక్క

మేడారం మాస్టర్ ప్లాన్, చిహ్నాల విషయంలో ఇంకా ఏవైనా అభ్యంతరాలు ఉంటే జాతర తర్వాత మార్పులు చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. లోతైన పరిశోధన తర్వాతనే గద్దెల అభివృద్ధి పనులు చేశామని అన్నారు. తన చేతుల మీదుగా జాతరను అభివృద్ధి చేసి వనదేవతలను ఆహ్వానించాలనే సంకల్పం తల్లుల దీవెనతో నెరవేరిందని అన్నారు. ఊరట్టం స్తూపాన్ని ఆదివాసీ అమరవీరుల స్తూపంగా మారుస్తామని అన్నారు.
News January 9, 2026
KNR: స్కూళ్లలో ‘ఫిర్యాదుల పెట్టె’.. వేధింపులకు ఇక చెక్!

పాఠశాల విద్యార్థుల రక్షణే ధ్యేయంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చేపట్టిన ‘ఫిర్యాదుల పెట్టె’ ఆలోచన ఆదర్శనీయంగా నిలుస్తోంది. బొమ్మకల్ హైస్కూల్లో ఈ పెట్టెను ఆమె స్వయంగా పరిశీలించారు. వేధింపులు, సమస్యలు ఎదురైతే విద్యార్థులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని కోరారు. మహిళా పోలీసుల పర్యవేక్షణలో వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని భరోసానిచ్చారు. కలెక్టర్ అద్భుతమైన చొరవపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
News January 9, 2026
రామడుగు కేజీబీవీలో కలెక్టర్ తనిఖీ

రామడుగు మండలం వెదిర కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆకస్మికంగా సందర్శించారు. వంటగది, తరగతి గదులను తనిఖీ చేసిన ఆమె.. ప్రభుత్వ మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, శుద్ధజలం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు.


