News February 12, 2026

సిద్దిపేట: 17న కొత్తగా ఎన్నికైన వార్డు సభ్యులకు శిక్షణ

image

కొత్తగా ఎన్నికైన వార్డు సభ్యులకు శిక్షణ నిర్వహణ బాధ్యతలను ఎంపీడీవోలకు అప్పగించారు. ఒక్కో బ్యాచ్‌లో సుమారు 100 మందికి ఐదు రోజుల నివాస శిక్షణ నిర్వహించనున్నారు. శిక్షణ హాల్, పరికరాలు, వసతి, భోజనం తదితర ఏర్పాట్లు సక్రమంగా చేయాలని, మహిళా సభ్యుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశించారు. శిక్షణ ఈనెల 17న ప్రారంభం కానున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News March 7, 2026

తుమ్మల జోక్యంతో ఆయిల్ పామ్ రైతులకు ఊరట

image

ఆయిల్ పామ్ రైతులకు మేలు చేసే GO 594ను రద్దు చేయాలని ప్రైవేట్ కంపెనీలు దాఖలు చేసిన WP 3736/2026 కేసును హైకోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నా.. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవ తీసుకుని అడ్వకేట్ జనరల్‌ను రంగంలోకి దించడంతో ప్రభుత్వానికి విజయం లభించింది. రైతులకు అధిక ధరలు కల్పించే ఈ జీవోను కాపాడటంపై రైతులు, టీజీ ఆయిల్ ఫెడ్ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News March 7, 2026

ఇరాన్‌లో మరోసారి భూకంపం

image

US, ఇజ్రాయెల్ దాడులతో అట్టుడుకుతున్న ఇరాన్‌లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రత నమోదైంది. బందర్ అబ్బాస్‌కు 74 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు US జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈనెల 3న కూడా గెరాష్ నగర సమీపంలో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో <<19288652>>భూకంపం సంభవించడం<<>> తెలిసిందే.

News March 7, 2026

శ్రీకాకుళం: కేజీబీవీల్లో ప్రవేశాలకు వేళాయె!

image

పేద విద్యార్థులకు ప్రమాణాలతో విద్య అందిస్తున్న కేజీబీవీలో 6 వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి ఏడాది ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. శ్రీకాకుళం జిల్లాలో 25 కేజీబీవీలు ఉన్నాయి. ఈనెల 12 నుంచి ఏప్రిల్ ఒకటి వరకు దరఖాస్తుకు అవకాశం ఇచ్చారు. డ్రాప్ అవుట్, అనాధ, సింగిల్ పేరెంట్ బాలికలకు ప్రాధాన్యత ఇస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.