News July 6, 2024
సిద్దిపేట: RTC బస్సు ఢీకొని HM మృతి

రోడ్డు ప్రమాదంలో ప్రధానోపాధ్యాయుడు మృతి చెందిన ఘటన చేర్యాలలో జరిగింది. SI దామోదర్, స్థానికుల వివరాల ప్రకారం.. సిద్దిపేట వాసి K.చంద్రశేఖర్(59) DNT స్కూల్లో గెజిటెడ్ HMగా పని చేస్తున్నారు. శుక్రవారం బైక్పై పాఠశాలకు బయలుదేరిన ఆయనను చేర్యాల వద్ద వెనుకనుంచి వస్తున్న RTC బస్సు ఢీకొంది. ప్రమాదంలో గాయపడిన చంద్రశేఖర్ను HYD తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు.
Similar News
News December 10, 2025
MDK: బాండ్ పేపర్ హామీలకు ఓట్లు వచ్చేనా?

ఈసారి ఉమ్మడి మెదక్ జిల్లాలో జీపీ ఎన్నికల్లో బాండ్ పేపర్ హామీల ట్రెండ్ పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీల హామీ బాండ్ ఇచ్చిన మాదిరిగానే జీపీ ఎన్నికల్లో అనేకచోట్ల బాండ్ పై అనేక హామీలతో కూడిన వాగ్దానాలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందోనని అభ్యర్థులు, ప్రజలు చూస్తున్నారు. శాసనసభ, లోక్సభ మాదిరిగా జీపీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులు గ్రామ ఓటర్లను ఆకట్టుకునేలా హామీలు గుప్పిస్తున్నారు.
News December 10, 2025
మెదక్: 3వ విడతలో 20 జీపీలు ఏకగ్రీవం

మెదక్ జిల్లాలో మూడవ విడతలో జరిగే ఎన్నికల్లో 20 గ్రామ పంచాయతీలు పూర్తిగా ఏకగ్రీవమయ్యాయి. 183 గ్రామపంచాయతీలలో ఎన్నికలు జరుగుతున్నాయి. నిన్న ఉపసంహరణల అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు ప్రకటించారు. మండలాల వారీగా చిలప్ చెడ్-2, కౌడిపల్లి-7, కుల్చారం-3, నర్సాపూర్-2, శివంపేట- 3, వెల్దుర్తి-3 గ్రామపంచాయతీలలో సర్పంచ్, వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
News December 10, 2025
MDK: మెదటి విడతకు 1,292 పోలింగ్ కేంద్రాలు

మొదటి విడత ఎన్నికల కోసం 6 మండలాల్లో 1,292 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఎన్నికలకు 155 ROలు, 1,421 POలు, 1,529 OPOలను నియమించారు. అల్లాదురం(M)లో మొత్తం 23,555 ఓటర్లు ఉండగా, పురుషులు 11,296, మహిళలు 12,259 మంది, హవేలీఘనపూర్(M)లో మొత్తం 29,863, పురుషులు 13,987, మహిళలు 15,876, పాపన్నపేట(M)లో మొత్తం 42,403, 19,986, మహిళలు 22,416, ఇతరులు ఒక్కరు ఉన్నారు.


