News April 13, 2025

సిద్దిపేట: RYVకి అప్లై చేశారా.. 14 వరకే ఛాన్స్

image

యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘రాజీవ్‌ యువ వికాసం పథకం’ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. శనివారం వరకు జిల్లాలో 15 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. రేపటి వరకు ఛాన్స్ ఉన్నందున ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అధికారులు సూచించారు. అర్హుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందన్నారు.

Similar News

News October 6, 2025

NZB: ప్రజలను చైతన్యం చేస్తున్న పోలీస్ కళా బృందాలు: CP

image

మాదకద్రవ్యాల వైపు యువత మొగ్గు చూపకుండా, సైబర్ నేరాలు తదితర అంశాలపై ప్రజలను పోలీసు కళా బృందాలు చైతన్య పరుస్తున్నాయని NZB పోలీస్ కమీషనర్ సాయి చైతన్య అన్నారు. ఈ మేరకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో గ్రామాలకు కళాబృందం సభ్యులు వెళ్లి మార్చి నుంచి సెప్టెంబర్ వరకు 117 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని వివరించారు.

News October 6, 2025

కామారెడ్డి: ఎన్నికల నగారా.. రాజకీయ కార్యాచరణ వేగం

image

రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో కామారెడ్డి జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. జిల్లాలోని ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, BRS పార్టీలు ఎన్నికల కార్యాచరణను వేగవంతం చేశాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు అభ్యర్థుల విజయం కోసం స్థానిక నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని కోరుతున్నారు.

News October 6, 2025

పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌.. భారత్‌కు 22 మెడల్స్

image

ఢిల్లీలో వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ పోటీలు ముగిశాయి. భారత్ 22 పతకాలను (6 గోల్డ్, 9 సిల్వర్, 7 బ్రాంజ్) గెలుచుకుంది. పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఇండియాకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. కాగా ఈ ఛాంపియన్‌షిప్‌‌లో 100కు పైగా దేశాల నుంచి 2,200 మందికి పైగా అథ్లెట్లు పోటీ పడ్డారు. ఖతార్, UAE, జపాన్ తర్వాత వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహించిన నాలుగో ఆసియా దేశంగా IND నిలిచింది.