News April 13, 2025
సిద్దిపేట: RYVకి అప్లై చేశారా.. 14 వరకే ఛాన్స్

యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘రాజీవ్ యువ వికాసం పథకం’ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్లైన్, ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు. శనివారం వరకు జిల్లాలో 15 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. రేపటి వరకు ఛాన్స్ ఉన్నందున ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అధికారులు సూచించారు. అర్హుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందన్నారు.
Similar News
News October 9, 2025
యూరియా కొరత నివారించేందుకు చర్యలు

రబీ వరి సాగులో యూరియా కొరతను నివారించేందుకు వ్యవసాయశాఖ చర్యలు చేపట్టింది. ఎకరాకు 3 బస్తాలకే పరిమితం చేసి, మొత్తం 94,383 టన్నుల అవసరాన్ని లెక్కగట్టింది. జిల్లాలో ప్రస్తుతం 6వేల టన్నుల నిల్వ ఉండగా, ఈ నెలాఖరుకు మరో 4వేల టన్నులు రానున్నాయి. రైతులు వ్యవసాయశాఖ ఇచ్చే ప్రత్యేక కార్డు ద్వారా మాత్రమే యూరియా పొందాలి. కార్డులో రైతు వివరాలు, భూమి విస్తీర్ణం, పంట వివరాలు ఉంటాయని జిల్లా వ్యవసాయాధికారిణి అన్నారు.
News October 9, 2025
మంత్రాలతో మద్యం మాన్పిస్తానని పూజారి మోసం

పూజారి మాటలు నమ్మి అనంతపురం మహిళ రూ.3.50 లక్షలు మోసపోయింది. భర్తకు మద్యం మాన్పించడానికి పూజలు చేస్తానన్న వీడియోను ఆమె సోషల్ మీడియాలో చూసి పూజారి దుర్గాప్రసాదరావును సంప్రదించారు. పూజలు, మంత్రాలకు ₹3.50 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడంతో నగలు తాకట్టు పెట్టి డబ్బు ఇచ్చారు. 10 నెలలు గడిచినా పూజలు చేయకపోవడంతో పూజారితో ఆమె గొడవకు దిగారు. స్థానికంగా ఇది రచ్చ కావడంతో డబ్బు వెనక్కి ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు.
News October 9, 2025
అమాయకుల చావుకు కారణం జగన్: పుల్లారావు

స్వప్రయోజనాలు, నీచ రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి అమాయకులను చంపేస్తుంటే ప్రభుత్వం ఊరుకోదని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. ఆయన హయాంలో రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని ఏరులై పారించారని మండిపడ్డారు. అమాయకుల చావులకు కారణమైన జగన్, తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మెడికల్ కాలేజీల నిర్మాణంపై విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.