News April 13, 2025
సిద్దిపేట: RYVకి అప్లై చేశారా.. 14 వరకే ఛాన్స్

యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘రాజీవ్ యువ వికాసం పథకం’ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్లైన్, ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు. శనివారం వరకు జిల్లాలో 15 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. రేపటి వరకు ఛాన్స్ ఉన్నందున ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అధికారులు సూచించారు. అర్హుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందన్నారు.
Similar News
News October 12, 2025
ములుగు: ప్రైవేటు ఆసుపత్రి.. అందినకాడికి గుంజుడే!

జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రుల తీరుతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యంతో ఆసుపత్రికి వస్తే అవసరం లేని టెస్టులు చేసి జేబులు ఖాళీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అడ్మిట్, పరీక్షల పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు. వ్యాధి పేరు చెప్పి రోగులను భయభ్రాంతులకు గురి చేస్తుండడం గమనార్హం.
News October 12, 2025
పీఆర్టీయూ మెదక్ జిల్లా నూతన అధ్యక్షుడిగా మేడి సతీశ్రావు ఎన్నిక

పీఆర్టీయూ మెదక్ జిల్లా నూతన అధ్యక్షుడిగా మేడి సతీశ్రావు ఎన్నికయ్యారు. జిల్లా సర్వసభ్య సమావేశం అనంతరం జరిగిన ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. సతీశ్రావు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని, అదే విధంగా సంఘాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బిక్షం గౌడ్, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.
News October 12, 2025
తిరుమలలో పెరిగిన రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్లు నిండిపోయి భక్తుల క్యూ లైన్ శిలాతోరణం వరకు దాటిపోయింది. నిన్న 84,571 మంది స్వామివారిని దర్శించుకున్నారు. కానుకల రూపంలో ₹3.70 కోట్లు సమర్పించారు. 36,711 మంది తలనీలాలు అర్పించారు. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు దర్శనానికి 20 గంటలు పడుతోంది. సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారు కేటాయించిన సమయానికి మాత్రమే క్యూలోకి రావాలని టీటీడీ సూచించింది.