News April 13, 2025
సిద్దిపేట: RYVకి అప్లై చేశారా.. 14 వరకే ఛాన్స్

యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘రాజీవ్ యువ వికాసం పథకం’ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్లైన్, ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు. శనివారం వరకు జిల్లాలో 15 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. రేపటి వరకు ఛాన్స్ ఉన్నందున ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అధికారులు సూచించారు. అర్హుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందన్నారు.
Similar News
News October 8, 2025
పాలమూరు యూనివర్సిటీ డిగ్రీ పరీక్ష ఫీజు తేదీలు విడుదల

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ మొదటి, మూడో, అయిదో సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షల ఫీజుల గడువును అధికారులు విడుదల చేశారు. విద్యార్థులు తమ కళాశాలల్లో ఈ నెల 21వ తేదీలోగా ఫీజు చెల్లించాలని సూచించారు. రూ.300 అపరాధ రుసుముతో ఫీజు చెల్లించడానికి ఈ నెల 25వ తేదీ వరకు అవకాశం ఉంటుందని యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి.
News October 8, 2025
KNR: మందకొడిగా వైన్ షాపులకు దరఖాస్తులు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 287 వైన్ షాపుల టెండర్లకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. కాగా, ఇప్పటివరకు 57 వైన్ షాపులకు గాను 163 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. అయితే మద్యం వ్యాపారులు దరఖాస్తులు వేయడంపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎప్పటిలాగే ఈసారి కూడా చివరి ఐదు రోజుల్లో దరఖాస్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇక గతేడాది 10,734 దరఖాస్తులకు సంబంధించి రూ.214.6 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు వచ్చింది.
News October 8, 2025
NCLTలో 32 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT)లో 32 స్టెనోగ్రాఫర్, ప్రైవేట్ సెక్రటరీస్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. డిగ్రీ ఉత్తీర్ణులైన కంప్యూటర్ స్కిల్స్, టైపింగ్ నాలెడ్జ్ గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. స్టెనోగ్రాఫర్కు నెలకు రూ.45వేలు, ప్రైవేట్ సెక్రటరీకి రూ.50వేలు జీతం అందిస్తారు. వెబ్ సైట్: https://nclt.gov.in/