News April 5, 2025
సిరసనగండ్ల బ్రహ్మోత్సవాలకు భారీ బందోబస్తు

నాగర్కర్నూల్ జిల్లా చారగొండ మండలం సిరసనగండ్ల గ్రామంలో నేటి నుంచి జరిగే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఐ విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఎస్ఐ శంషుద్దీన్, అగ్నిమాపక ఇతర అధికారులతో కలిసి ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఎవరైనా భక్తులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News October 16, 2025
మక్తల్: దొంగల దాడి.. ఇంటి యజమానికి గాయాలు

మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్తగార్లపల్లిలో గురువారం అర్ధరాత్రి దొంగలు ఇంట్లోకి చొరబడి మహిళ మెడలోని పుస్తెలతాడు లాక్కోవడానికి యత్నించారు. అడ్డుకున్న ఇంటి యజమాని అంజిలప్పను రాడ్తో దెబ్బకొట్టి గాయపరిచారు. ఆ మహిళ అరుపులు కేకలు వేయడంతో గ్రామస్థులు పరుగున చేరుకునే లోపు ముగ్గురిలో ఇద్దరు దొంగలు పరారయ్యారు. ఒక దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News October 16, 2025
మధ్యాహ్నం కేబినెట్ భేటీ.. సురేఖ వస్తారా..?

తెలంగాణ కాంగ్రెస్లో కొండా దంపతుల వ్యవహారం మరింత ముదిరింది. పొంగులేటిపై టెండర్ల విషయంలో కామెంట్లు సహా, రెడ్లంతా తమ ఫ్యామిలీపై కుట్ర చేస్తున్నారని ఆమె కూతురు ఆరోపణలు చేయడం తెలిసిందే. ఇవాళ మధ్యాహ్నం కేబినెట్ భేటీ ఉండగా ఆమె వస్తారా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. అటు సురేఖ రాజీనామా చేస్తారని కొందరు, ఆమెను తప్పిస్తారని మరికొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది.
News October 16, 2025
కొండా దంపతుల భవిష్యత్ కార్యాచరణ ఏంటి?

మంత్రి పొంగులేటితో మొదలైన లొల్లి సుమంత్ విషయం వరకు వెళ్లి సీఎంను కూడా తాకింది. తమపై రెడ్లు కుట్ర చేస్తున్నారంటూ సుష్మిత ఆరోపించగా.. సుమంత్ విషయం తనకేమీ తెలియదని మురళి తెలిపారు. హన్మకొండలోని సురేఖ ఇంటివద్ద పోలీస్ అవుట్ పోస్టునూ తొలగించారు. మరోవైపు ఇవాళ కార్యకర్తలతో కొండా దంపతుల భేటీ ఉండగా.. మురళి మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది.