News December 17, 2024
సిరికొండ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించిన రైతు బిడ్డ

సిరికొండ మండల కేంద్రానికి చెందిన కస్బె రామారావు కుమారుడు కస్బె సాయికుమార్ ఇటీవల విడుదలైన సీఆర్పీఎఫ్ ఫలితాల్లో ఉద్యోగం సాధించాడు. తల్లి తండ్రులు వృత్తి రీత్యా వ్యవసాయం చేస్తారు. సిరికొండ మండల కేంద్రంలోనే ఎస్సీ సామాజిక వర్గంలో మొట్ట మొదటి సారిగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అరుదైన ఘనత రామారావు తెలిపారు. ఈ సందర్భంగా కస్బె సాయికుమార్ ను స్నేహితులు, కుటుంబీకులు, గ్రామస్తులు అభినందించారు.
Similar News
News February 27, 2026
ఆదిలాబాద్: MAR 10న మెగా JOB మేళా..!

పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతతోపాటు ఆదివాసీ యువత అభివృద్ధి కోసం MAR 10న ఆదిలాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో మెగా JOB మేళా నిర్వహించనుండటం అభినందనీయమని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జాబ్ మేళా పోస్టర్లను గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ జాబ్ మేళాలో 50కిపైగా కంపెనీల ద్వారా 2వేలకుపైగా ఉద్యోగాలను కల్పించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. SHARE.
News February 26, 2026
‘బాల్యవివాహ రహిత జిల్లాగా నిలిపేందుకు పునరంకితం కావాలి’

ఆదిలాబాద్ జిల్లాను బాల్యవివాహ రహితంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. బాల్యవివాహ నిరోధక అధికారులకు నిర్వహించిన అభయ అవగాహన సదస్సును ఆయన ప్రారంభించారు. గ్రామ, పట్టణాలలో బాలల సంరక్షణ కమిటీలు ప్రతినెలా విధిగా సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. బాల్యవివాహ రహిత జిల్లాగా నిలిపేందుకు ప్రతిఒక్కరూ పునరంకితం కావాలని కలెక్టర్ కోరారు.
News February 26, 2026
ఆదిలాబాద్లో SSC విద్యార్థులకు గ్రాండ్ ప్రాక్టీస్ టెస్టులు

ఆదిలాబాద్ జిల్లాలో పదో తరగతి విద్యార్థుల కోసం గ్రాండ్ టెస్టుల షెడ్యూల్ను జిల్లా విద్యాశాఖ విడుదల చేసింది. మార్చి 2 నుంచి 10 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులకు ప్రత్యేక తేదీలను కేటాయించారు. ఈ పరీక్షల ద్వారా విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు మరింత మెరుగ్గా తయారవ్వాలనే ఉద్దేశంతో అధికారులు ఈ చర్యలు చేపట్టారు.


