News December 17, 2024
సిరికొండ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించిన రైతు బిడ్డ
సిరికొండ మండల కేంద్రానికి చెందిన కస్బె రామారావు కుమారుడు కస్బె సాయికుమార్ ఇటీవల విడుదలైన సీఆర్పీఎఫ్ ఫలితాల్లో ఉద్యోగం సాధించాడు. తల్లి తండ్రులు వృత్తి రీత్యా వ్యవసాయం చేస్తారు. సిరికొండ మండల కేంద్రంలోనే ఎస్సీ సామాజిక వర్గంలో మొట్ట మొదటి సారిగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అరుదైన ఘనత రామారావు తెలిపారు. ఈ సందర్భంగా కస్బె సాయికుమార్ ను స్నేహితులు, కుటుంబీకులు, గ్రామస్తులు అభినందించారు.
Similar News
News January 22, 2025
MNCL:మల్టీ లెవెల్ స్కీమ్స్తో అప్రమత్తంగా ఉండాలి:CP
మల్టీ లెవెల్ స్కీమ్స్తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనరేట్ సీపీ శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటన పట్ల ఆకర్షితులై మోసపోవద్దని హెచ్చరించారు. అనేక స్కీములతో బురిడీ కొట్టిస్తున్నారని తెలిపారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడితే 1930 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. స్థానిక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను ఆశ్రయించాలని పేర్కొన్నారు.
News January 22, 2025
నిర్మల్: కాశీలో గుండెపోటుతో ఫార్మసిస్టు మృతి
నిర్మల్లోని ప్రధాన ఆస్పత్రిలో ఆయుర్వేద ఫార్మసిస్టుగా పనిచేస్తున్న ఫణిందర్ (50) గుండెపోటుతో మృతి చెందాడు. పట్టణంలోని బుధవార్ పేట్ కాలనీకి చెందిన ఫణిందర్ ఉత్తర్ ప్రదేశ్లోని కుంభమేళాకు వెళ్లారు. కాశీలో దైవ దర్శనం చేస్తున్న క్రమంలో గుండెపోటుతో మంగళవారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
News January 22, 2025
నాగోబా జాతర విశేషాలు మీకు తెలుసా..!
తెలంగాణలోనే రెండో అతిపెద్దదైన నాగోబా జాతర జనవరి 28న ప్రారంభం కానుంది. మేస్రం వంశీయులు ఇప్పటికే గంగాజలం తీసుకొని రావడానికి జన్నారంలోని కలమడుగుకు బయలుదేరారు. అయితే వారు జలం తీసుకొచ్చే కుండులను ఓ ప్రత్యేక వంశీయులే చేస్తారని చాలా మందికి తెలియదు. ఈ కుండలను సిరికొండలోని గుగ్గిల్ల వంశీయులు తయారుచేస్తారు. మేస్రం వంశీయులు పూజకు వినియోగించే దీపంతలు, నీటికుండలు, వంట ఉపయోగించే పాత్రలను కూడా వారే అందిస్తారు.