News March 10, 2025
సిరికొండ: వడ్డీ వ్యాపారుల వేధింపులకు యువకుడి బలి

సిరికొండ మండలం ముషిరునగర్కు చెందిన మనోహర్ నిజామాబాద్లోని నాందేవ్వాడకు చెందిన జ్యోతి వద్ద ఆరు నెలల క్రితం రూ.40వేలు అప్పు తీసుకున్నారు. వడ్డీతో కలిపి రూ.80వేలు చెల్లించాలని మనోహర్పై కొద్దికాలంగా జ్యోతి మనుషులు బెదిరింపులకు పాల్పడ్డారు. రెండు రోజుల క్రితం అతని వద్ద ఉన్న మొబైల్ ఫోన్ తీసుకెళ్ళారు. తీవ్ర మనస్తాపానికి గురైన మనోహర్ పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News November 25, 2025
26న BRS సన్నాహక సమావేశం: జీవన్ రెడ్డి

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఈనెల 29న నిర్వహించనున్న ‘దీక్షా దివస్’ను విజయవంతం చేయడానికి నిజామాబాద్లో ఈ నెల 26న సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ చరిత్రలో నవంబర్ 29 ఒక మైలురాయి లాంటిదని ఆయన పేర్కొన్నారు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో..’ అనే నినాదమే ఉద్యమానికి ఊపిరి పోసిందని ఆయన గుర్తు చేశారు.
News November 25, 2025
నిజామాబాద్ జిల్లాలో అతివలే కీలకం

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లా పంచాయతీ అధికారులు విడుదల చేసిన ఓటరు తుది జాబితా ప్రకారం నిజామాబాద్ జిల్లాలో మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. జిల్లాలో మొత్తం 8,51,417 మంది ఓటర్లు ఉండగా మహిళలు 4,54,621 మంది ఉన్నారు. ARMR డివిజన్లో 1,95,092 మంది, BDN డివిజన్లో 1,21,591 మంది, NZB డివిజన్లో 1,46,938 మంది మహిళలు ఉన్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా పురుషులు 3,96,778 మంది ఉన్నారు. ఇతరులు 18 మంది ఉన్నారు.
News November 25, 2025
NZB జిల్లాలో ఎవరికి ఎన్ని సర్పంచ్ పదవుల రిజర్వేషన్లు అంటే?

నిజామాబాద్ జిల్లాలోని 545 గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవుల రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి. 100% ST GP ల్లో ST (W) -33, ST(Gen) 38, నాన్ షెడ్యూల్ ఏరియాల్లో ST(W) 8, ST(Gen) 17, SC(W) 35, SC (Gen) 47, BC(W) 55, BC (Gen) 70, అన్ రిజర్వ్డ్ పంచాయతీల్లో మహిళలకు 113, పురుషులకు 129 వార్డులను రిజర్వ్ చేసినట్లు అధికారులు తెలిపారు.


