News April 5, 2025

సిరిసినగండ్ల సీతారాముల కళ్యాణానికి ఆలయం ముస్తాబు..!

image

రెండో భద్రాద్రిగా పేరుగాంచిన చారకొండ మండలం సిరిసినగండ్ల సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా జరిగే సీతారాముల కళ్యాణానికి దేవాలయం నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏటా సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ కళ్యాణం తిలకించడానికి నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.

Similar News

News December 3, 2025

ALERT.. అతి భారీ వర్షాలు

image

AP: రాబోయే 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడతాయని IMD అంచనా వేసింది. రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది.

News December 3, 2025

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటుందని, ప్రతి గ్రామంలో రైతులకు అవసరమైన సేవలు రైతు సేవా కేంద్రాల ద్వారా సమయానికి అందేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ జి.రాజకుమారి అన్నారు. రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా నంద్యాల రూరల్ మండలం పెద్దకొట్టాల గ్రామ రైతు సేవా కేంద్రంలో రైతులతో ముచ్చటించారు. రబీ సీజన్‌కు సంబంధించిన ఈ-క్రాప్ నమోదు విధానం, ఎరువుల లభ్యతపై అవగాహన కల్పించారు.

News December 3, 2025

ఏపీ టెట్ హాల్‌టికెట్లు విడుదల

image

ఈ నెల 10 నుంచి జరగనున్న ఏపీ టెట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక <>వెబ్‌సైట్లోకి<<>> వెళ్లి తమ వివరాలు ఎంటర్ చేసి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈసారి టెట్‌కు 2,41,509 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. రెండు విడతల్లో పరీక్షలు జరగనుండగా ఫస్ట్ సెషన్ ఉ.9.30 గంటల నుంచి మ.12 గంటల వరకు నిర్వహిస్తారు. సెకండ్ సెషన్ మ.2.30 గంటల నుంచి సా.5 గంటల వరకు జరుగుతుంది.