News April 5, 2025

సిరిసినగండ్ల సీతారాముల కళ్యాణానికి ఆలయం ముస్తాబు..!

image

రెండో భద్రాద్రిగా పేరుగాంచిన చారకొండ మండలం సిరిసినగండ్ల సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా జరిగే సీతారాముల కళ్యాణానికి దేవాలయం నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏటా సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ కళ్యాణం తిలకించడానికి నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.

Similar News

News November 15, 2025

ప్రాతఃకాల విశేష దర్శనంలో భద్రకాళి అమ్మవారు

image

వరంగల్ భద్రకాళి దేవస్థానంలో కార్తీక మాసం శనివారం ఏకాదశి సందర్భంగా ఆలయ అర్చకులు భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలు చేసి హారతినిచ్చారు. ప్రాతఃకాల విశేష దర్శనంలో అమ్మవారు దర్శనమిచ్చారు. భక్తులు ఉదయం నుంచి ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకొని పూజలు చేస్తున్నారు. ఆలయ అర్చకులు తదితరులున్నారు.

News November 15, 2025

ఒక్కసారే గెలిచి.. 20 ఏళ్లు సీఎంగా!

image

బిహార్ రాజకీయాల్లో నితీశ్ కుమార్‌ గుత్తాధిపత్యం కొనసాగుతోంది. 2000లో తొలిసారి CM పదవి చేపట్టి రాజకీయ అనిశ్చితితో 7 రోజుల్లోనే రాజీనామా చేశారు. తర్వాత 9 సార్లు CM అయ్యారు. 1985లో MLAగా గెలిచిన ఆయన ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ MLCగా ఎన్నికవుతూ CMగా కొనసాగుతున్నారు. ‘నా సీటు గెలవడం పెద్ద విషయం కాదు. మిగతా సీట్లపై దృష్టి పెట్టేందుకే పోటీ చేయను’ అని నితీశ్ చెబుతుంటారు.

News November 15, 2025

భద్రకాళి చెరువులో అద్దాల వంతెన!

image

ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళి అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ఒక కొత్త అనుభూతి రానుంది. భద్రకాళి చెరువు మధ్యలో ఏర్పాటు చేసే ఐలాండ్ నుంచి చెరువు బండ్ వరకు అద్దాల వంతెన ఏర్పాటుకు అడుగు పడింది. కిలో మీటర్ రోప్ వే, 250 మీటర్ల అద్దాల వంతెన కోసం పలు సంస్థలు శుక్రవారం ప్రజెంటేషన్లు ఇచ్చాయి.దాదాపు రూ.70 కోట్ల వరకు నిధులు అవసరమవుతాయని కుడా అధికారులు భావిస్తున్నారు. దీంతో WGL పర్యాటకానికి కొత్త పుంత రానుంది.