News March 12, 2025

సిరిసిల్ల: అక్రమ రవాణా నిరోధంపై శిక్షణ కార్యక్రమం

image

సిరిసిల్లలో మానవ అక్రమ రవాణా నిరోధంపై శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్డీవో శేషాద్రి మాట్లాడారు. పిల్లల అపహరణ, యువతులను ప్రలోభాలకు గురిచేసి వేశ్య గృహాలకు తరలించడం, సైబర్ మోసాలకు పాల్పడటం వంటి వాటిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీవో కొట్టే శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.

Similar News

News November 9, 2025

రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీకి షాకింగ్ కలెక్షన్లు

image

రష్మిక లీడ్ రోల్‌లో నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు ఆశించినస్థాయిలో రావట్లేదు. తొలి రోజు తెలుగు, హిందీలో ₹1.30 కోట్లు, రెండో రోజు ₹2.50 కోట్లు నెట్ కలెక్షన్లు వచ్చినట్లు Sacnilk వెల్లడించింది. ఇవాళ ఆదివారం కావడంతో కలెక్షన్లు పెరగొచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు బుక్ మై షోలో D1 34K టికెట్లు అమ్ముడవగా, D2 68Kకు పెరిగినట్లు గీతా ఆర్ట్స్ పేర్కొంది.

News November 9, 2025

5 రాష్ట్రాల్లో రూ.95 కోట్ల స్కామ్స్.. 81 మంది అరెస్ట్

image

TG: సైబర్ నేరగాళ్లపై రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉక్కుపాదం మోపుతోంది. AP, TN, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకలో ఆపరేషన్ చేపట్టి 81 మంది నిందితులను అరెస్ట్ చేసింది. వీరిపై 754 కేసులున్నాయని, రూ.95 కోట్ల విలువైన మోసాలకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. వారి నుంచి 84 ఫోన్లు, 101 సిమ్‌లు, 89 బ్యాంక్ పాస్ బుక్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితుల ఖాతాల్లోని రూ.కోట్ల నగదును ఫ్రీజ్ చేశామన్నారు.

News November 9, 2025

ఏలూరులో జాతీయ న్యాయ సేవా దినోత్సవం

image

జాతీయ న్యాయ సేవా దినోత్సవ కార్యక్రమం ఆదివారం ఏలూరు కోర్టు ప్రాంగణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగంలోని 39ఏ అధికరణం ప్రకారం, దేశంలోని ప్రతి పౌరుడికి న్యాయం అందుబాటులో ఉండాలని, ఆర్థిక లేదా ఇతర బలహీనతల కారణంగా ఎవరికీ న్యాయం అందకుండా పోకూడదని న్యాయమూర్తులు పేర్కొన్నారు.