News March 10, 2025

సిరిసిల్ల: అట్రాసిటీ కేసుల పరిహారం పంపిణీ: కలెక్టర్

image

ఎస్సీ, ఎస్టీలకు అట్రాసిటీ కేసుల పరిహారం పంపిణీ చేసినట్టు సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. మొత్తం సిరిసిల్ల జిల్లాలోని 46 మంది బాధితులకు రూ 36,87,500 లను వారి వారి బ్యాంకు ఖాతాలో జమ చేసినట్టు ఆయన స్పష్టం చేశారు.

Similar News

News December 1, 2025

గంభీర్, రోహిత్ మధ్య లాంగ్ డిస్కషన్

image

SAతో తొలి వన్డేలో IND గెలుపు అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో గంభీర్, రోహిత్ మధ్య లాంగ్ డిస్కషన్ జరగడం కెమెరా కంట పడింది. 11కే 3 వికెట్లు కోల్పోయిన స్థితి నుంచి దాదాపు మ్యాచ్ గెలిచేంతలా SA జట్టు ఎలా కమ్‌బ్యాక్ చేసిందనే దానిపై చర్చించినట్లు తెలుస్తోంది. మిగిలిన 2 వన్డేల్లో ఆ జట్టును ఎలా కట్టడి చేయాలి, బౌలింగ్‌లో చేసిన తప్పులపై మాట్లాడినట్లు సమాచారం. వీళ్లిద్దరి డిస్కషన్ గురించి మీరేమనుకుంటున్నారు?

News December 1, 2025

నేటి నుంచే పార్లమెంట్ వింటర్ సెషన్స్

image

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 19 వరకు మొత్తం 15 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ ఉదయం 11 గంటలకు సెషన్స్ ప్రారంభం కానుండగా, ఇటీవల మరణించిన ఎంపీలకు తొలుత సంతాపం తెలపనున్నారు. తాజా సమావేశాల్లో 14 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అటు SIRపై ఎన్డీయే ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిపక్షాలు సన్నద్ధం కాగా వాడీవేడిగా చర్చ జరిగే ఛాన్స్ ఉంది.

News December 1, 2025

శివుడు ఎలా జన్మించాడో తెలుసా?

image

సృష్టి కార్యంలో భాగంగా విష్ణువు నుదుటి తేజస్సు నుంచి శివుడు ఆవిర్భవించాడని మనం పురాణాల్లో చదువుకున్నాం. అయితే శివుడు స్వయంభూ అని, ఆయన ఎవరి నుంచి జన్మించలేదని, ఆయనే సర్వానికి మూలమని శివ పురాణం పేర్కొంటుంది. శివుడు ధ్యానంలో రుద్రాక్షమాలను లెక్కిస్తున్నప్పుడు, ఓ రుద్రాక్ష నుంచి విష్ణుమూర్తి జన్మించాడని చెబుతోంది. ఈ భిన్న కథనాలు అంతిమంగా త్రిమూర్తుల ఏకత్వతత్త్వాన్ని చాటిచెబుతున్నాయి.