News February 17, 2025
సిరిసిల్ల: అర్జీలకు వేగంగా పరిష్కారం చూపాలి: కలెక్టర్

ప్రజావాణిలో వచ్చే అర్జీలకు వేగంగా పరిష్కారం చూపాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల వద్ద నుంచి 116 దరఖాస్తుల స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Similar News
News September 19, 2025
MANUUలో టీచింగ్ పోస్టులు

మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (<
News September 19, 2025
జగనన్నా అసెంబ్లీకి వెళ్లు.. YCP ఫ్యాన్స్

AP: మాజీ సీఎం జగన్ <<17754283>>అసెంబ్లీకి<<>> వెళ్లి ప్రజాసమస్యలపై మాట్లాడాలని వైసీపీ ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. అసెంబ్లీలో అవమానాలు, విమర్శలు ఎదురైనా, మైక్ కట్ చేసినా సమస్యలపై గళం విప్పితే ప్రజల్లో సానుభూతి వస్తుందని చెబుతున్నారు. రాష్ట్రంలో యూరియా, ఉల్లి, టమాటా ధరలు పడిపోవడం సహా ఎన్నో సమస్యలు ఉన్నాయని, వీటిపై చర్చించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని సూచిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
News September 19, 2025
ఏలూరులో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

ఏలూరు రూరల్ పరిధిలోని ఓ దాబాలో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారంతో పోలీసులు గురువారం రాత్రి దాడులు చేశారు. నిర్వహకుడితో పాటు ఇద్దరు విటులను, మరో ఇద్దరి యువతులను అరెస్టు చేశామని SI నాగబాబు చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించి నిర్వహకుడిపై కేసు నమోదు చేశారు.