News February 20, 2025
సిరిసిల్ల: అసత్య ప్రచారాలు చేస్తే కేసు నమోదు: కలెక్టర్

సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారాలు చేస్తే కేసులు నమోదు చేస్తామని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. తనపై వివిధ కేసులు ఉన్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని తనపై ఎలాంటి కేసులు లేవని తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయిస్తామన్నారు.
Similar News
News November 22, 2025
సిరిసిల్ల: బడి చేరాలంటే వాగు దాటాల్సిందే..!

వాగు దాటితేనే ఆ ఊరి పిల్లలకు చదువు. ప్రతిరోజు విద్యార్థులు చదువు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. SRCL(D) కోనరావుపేట మండలంలోని వెంకట్రావుపేట, కొండాపూర్ గ్రామాల విద్యార్థులు మూలవాగు అవతల ఉన్న బావుసాయిపేట పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. వరద ఉద్ధృతికి ఏళ్ల క్రితం నాటి వంతెన కొట్టుకుపోగా పాలకులు, అధికారులు పట్టించుకున్న పాపాన పోవడంలేదు. దీంతో చిన్నారులు నిత్యం వాగులో నుంచే పాఠశాలకు చేరుతున్నారు.
News November 22, 2025
HYD: నేడు కార్గో వస్తువుల వేలం

HYDలోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్లో పెండింగ్లోని కార్గో, పార్సిల్ వస్తువులకు నేడు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జోన్ లాజిస్టిక్ మేనేజర్ బద్రి నారాయణ తెలిపారు. MGBSలోని పార్సిల్ గోడౌన్ ఆవరణలో ఉదయం 10 గంటలకు వేలం ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు వేలంలో పాల్గొనాలని కోరారు.
News November 22, 2025
సిరిసిల్ల: CESS ఆఫీసుకు వాస్తు దోషం ఉందట..!

CESS ఆఫీసుకు వాస్తు దోషం ఉందా అంటే తాజా పరిణామాలు చూస్తే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పాలకవర్గంలో విభేదాలు రావడం, అవినీతి ఆరోపణలపై విజిలెన్స్ అధికారుల తనిఖీలతో CESS కార్యాలయం నిత్యం వార్తల్లో నిలుస్తోంది. దీంతో ఛైర్మన్ చిక్కాల రామారావు నివారణ మార్గాలు అన్వేషిస్తున్నారు. హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామిని CESS కార్యాలయానికి ఆహ్వానించి వాస్తు దోషాలను చూడాలని కోరడం చర్చనీయాంశమైంది.


