News March 6, 2025

సిరిసిల్ల: ఆయుర్వేద వైద్యం పేరుతో మోసం, వ్యక్తి అరెస్టు: డిఎస్పీ

image

ఆయుర్వేద వైద్యం పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సిరిసిల్ల పట్టణంలో గురువారం ఆయన ప్రకటన విడుదల చేశారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన అజయ్ అనే వ్యక్తి జిల్లాలో పక్షపాతం తగ్గిస్తానని ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేశాడన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామన్నారు

Similar News

News November 2, 2025

శివాలయాలు, తీరప్రాంతాల్లో భద్రత పటిష్ఠం: ఎస్పీ

image

కార్తీక మాసంలో సముద్రతీరాలు, నదీ తీరాలు, శివాలయాలకు భక్తులు అధికంగా చేరతారని అధికారులు సమగ్ర భద్రతా చర్యలు చేపట్టారు. ప్రధాన ప్రదేశాల్లో బందోబస్తు, గజ ఈతగాళ్ల నియామకం, మహిళా భద్రతకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఆలయాలు, పిక్నిక్ స్పాట్లలో నిఘా, పెట్రోలింగ్ పెంచారు. సోమవారాలు, పర్వదినాల్లో అదనపు సిబ్బంది, ట్రాఫిక్ నియంత్రణ, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేపట్టనున్నట్లు ఎస్పీతుహిన్ సిన్హా తెలిపారు.

News November 2, 2025

దేవాలయాల వద్ద ఏర్పాట్లుపై కలెక్టర్ సూచనలు

image

కార్తీక సోమవారం సందర్భంగా జిల్లాలోని వివిధ దేవాలయాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉందని, దేవాలయాలపై కన్నేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. దేవాలయాల వద్ద భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్య చర్యలు పకడ్బందీగా ఉండేలా అధికారులు, దేవస్థాన నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తులు క్రమశిక్షణగా, శాంతియుతంగా దర్శనాలు ముగించుకోవాలన్నారు.

News November 2, 2025

ఉండవెల్లి: చికిత్స పొందుతూ యువకుడి మృతి

image

ఉండవెల్లి మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై అక్టోబర్ 30వ తేదీన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో బైక్‌పై వెళ్తున్న మెన్నిపాడు గ్రామానికి చెందిన శేఖర్ తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి 108లో తరలించారు. చికిత్స పొందుతూ శేఖర్ మృతి చెందాడు. మృతుడు భార్య శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, సంఘటనకు కారణమైన వాహనం కోసం దర్యాప్తు చేపట్టామని తెలిపారు.