News March 12, 2025
సిరిసిల్ల: ఈనెల 13న జాబ్మేళా

ఈనెల 13వ తేదీన సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో జరిగే జాబ్ మేళా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి నీల రాఘవేందర్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. SSC, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన మహిళ అభ్యర్థులు సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో ఈనెల 13న ఉదయం 11 గంటలకు ఒరిజినల్ సర్టిఫికెట్స్తో హాజరుకావాలని సూచించారు.
Similar News
News February 12, 2026
NLG: మహా శివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

మహా శివరాత్రి పండుగ సందర్భంగా శైవ క్షేత్రాల దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ఈ నెల 14, 15 తేదీల్లో ప్రత్యేక బస్సులు నడుపుతోందని ఆర్ఎం కె.జానిరెడ్డి తెలిపారు. DVK డిపో నుంచి శ్రీశైలం, KDD డిపో నుంచి ముక్త్యాల, మేళ్లచెర్వు, HZNR నుంచి మేళ్లచెర్వుకు, MLG డిపో నుంచి వాడపల్లి, సోమప్ప, సత్రశాలకు బస్సులు నడుపుతామని పేర్కొన్నారు. SRPT డిపో నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడుపుతామని తెలిపారు.
News February 12, 2026
చిత్తూరు: పరీక్షల్లో అధికారుల ఫెయిల్.. 19మందిపై చర్యలు

రెవెన్యూ శాఖలో తాత్కాలిక షరతులతో సీనియర్ అసిస్టెంట్లుగా ఇటీవల ప్రమోషన్ వచ్చింది. శాఖాపరమైన పరీక్షల్లో పాస్ కాకపోవడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 19 మందిని తిరిగి గ్రేడ్-1 వీఆర్వోలుగా రివర్షన్ చేస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. వీరు శాఖపరమైన పరీక్షల్లో అనుకున్న మేర ఫలితాలు సాధించకపోవడంతో రివర్షన్ ఇచ్చినట్టు అందులో పేర్కొన్నారు.
News February 12, 2026
మెదక్ జిల్లాలో 4 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు

మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది. జిల్లాలోని 4 మున్సిపాలిటీలకు వేర్వేరుగా లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్లో గోల్డ్ బంగ్లా వెస్లీ కళాశాల, నర్సాపూర్లో BVRIT, తూప్రాన్లో నోబుల్ ఫార్మా కళాశాల, రామాయంపేటలో ఎంపీడీవో కార్యాలయంలో ఓట్ల లెక్కింపు జరగనుంది. రేపు ఉదయం నుండే ఈ ప్రక్రియ ప్రారంభం కానుండటంతో ఏర్పాట్లు పూర్తి చేశారు.


