News March 13, 2025

సిరిసిల్ల :ఎస్పీని కలిసిన బీఆర్ఎస్ నేతలు

image

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మహేష్ బి గీతేను బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోటా ఆగయ్య నేడు మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చక్రపాణి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్, నాయకులు లక్ష్మీనారాయణ, మురళి, శ్రీనివాస్, సర్దార్ ఉన్నారు.

Similar News

News October 19, 2025

నిర్మల్: మద్యం దుకాణాలకు 942 దరఖాస్తులు

image

మద్యం దుకాణాలకు 942 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ అబ్దుల్ రజాక్ తెలిపారు. జిల్లాలోని 47 మద్యం దుకాణాలకు జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో దరఖాస్తులను స్వీకరించారు. శనివారం ఒక్కరోజే 529 దరఖాస్తులు వచ్చాయని ఇందులో భైంసా ఎక్సైజ్ పరిధిలో 186 దరఖాస్తులు రాగా నిర్మల్ ఎక్సైజ్ పరిధిలో 343 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. శనివారం రాత్రి వరకు దరఖాస్తులను స్వీకరించారు.

News October 19, 2025

నిర్మల్: మద్యం దుకాణాల దరఖాస్తు గడువు పొడిగింపు

image

మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 23 వరకు పొడిగించినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ అబ్దుల్ రజాక్ ప్రకటించారు. బీసీ బంద్, బ్యాంకుల బంద్ కారణంగా దరఖాస్తులు వేయలేని ఆశావహుల విజ్ఞప్తి మేరకు ఎక్సైజ్ కమిషనర్ ఈ గడువును పెంచారు. అక్టోబరు 27న లక్కీ డ్రా నిర్వహిస్తామని, కావున దరఖాస్తుదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

News October 19, 2025

‘కాంతార’లో మెప్పించిన SRపురం వాసి

image

పాన్ ఇండియా మూవీ ‘కాంతార’లో SRపురం(M) పొదలపల్లికి చెందిన ఏకాంబరం నటించారు. ఇందులో భాగంగా తన నటనకు దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి మొచ్చకున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన్ను స్వగ్రామం గంగాధర నెల్లూరులో వైసీపీ నేత కృపాలక్ష్మి అభినందించారు. సినిమా రంగంలో మరింత ప్రతిభ చూపి గుర్తించ దగ్గ పాత్రలు పోషించాలని ఆమె ఆకాంక్షించారు.