News March 19, 2025

సిరిసిల్ల: ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిసిన గౌడ సంఘం నాయకులు

image

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బి గితేను జిల్లా గౌడ సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్‌తో పాటు నాయకులు సిరిసిల్ల ప్యాక్స్ ఛైర్మన్ బండి దేవదాస్ గౌడ్, మాజీ ఏఎంసీ ఛైర్మన్ కొండ రమేష్ గౌడ్, ఎల్లారెడ్డిపేట మాజీ సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు బాల్ రెడ్డి, బోయిన్పల్లి మాజీ జెడ్పిటిసి పులి లక్ష్మీపతి గౌడ్, గాదగోని సాగర్ గౌడ్‌లు ఎస్పీని శాలువాతో సత్కరించి సన్మానించారు.

Similar News

News September 18, 2025

శాంతి భద్రతలకు విఘాతం కలిగితే కఠిన చర్యలు: SP

image

జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సిబ్బంది చర్యలు తీసుకోవాలని SP హర్షవర్ధన్‌రాజు సూచించారు. గురువారం పోలీసు కార్యాలయంలోని గెలాక్సీ భవనంలో అదనపు SPలు, DSPలు, CI, SIలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మాదకద్రవ్యాల నిర్మూలన, రోడ్డు ప్రమాదాల నివారణపై పలు సూచనలు చేశారు. కేసుల పరిష్కారంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

News September 18, 2025

ఈ-గవర్నెన్స్ సదస్సుకు అన్ని ఏర్పాట్లు చేయాలి – కలెక్టర్

image

విశాఖలో సెప్టెంబ‌ర్ 22, 23న జరిగే 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సుకు పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడారు. నోవాటెల్ హోటల్‌లో జరిగే ఈ సదస్సులో ఐటీ నిపుణులు, కేంద్ర-రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారని తెలిపారు. 13 ప్రధాన, 10 ఉప కమిటీల సమన్వయంతో నగర సుందరీకరణ, భద్రత, శానిటేషన్ తదితర చర్యలు చేపట్టాలని సూచించారు.

News September 18, 2025

తల్లిదండ్రులకు సత్వర న్యాయం చేయాలి: జగిత్యాల కలెక్టర్

image

జగిత్యాల కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో దివ్యాంగుల & వయోవృద్ధుల జిల్లా కమిటీ సమావేశం గురువారం ఏర్పాటు చేశారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులను విస్మరించే కుమారులు, కోడళ్లు, వారసులకు సీనియర్ సిటిజన్స్ కమిటీ ప్రతినిధులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తూ వారిలో చైతన్యం కల్పించాలన్నారు. ఫిర్యాదులు ఇచ్చే వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల స్పందించి వారికి సత్వర న్యాయం చేయాలన్నారు.