News January 26, 2025

సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్

image

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 3, 2025

SLBC టన్నెల్.. రేపటి నుంచి సర్వే

image

TG: SLBC (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) టన్నెల్ పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రిపేర్ అవుతోంది. రేపు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ఎలక్ట్రో మాగ్నెటిక్ సర్వేను ప్రారంభించనున్నారు. సొరంగాల నిపుణుల సహాయంతో ఈ సర్వే చేపట్టనున్నారు. గతేడాది టన్నెల్ కూలి 8 మంది కార్మికులు మరణించడంతో అలాంటి లూస్ సాయిల్ ఎక్కడ ఉందో దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఈ సొరంగం మొత్తం పొడవు 43.9 కి.మీ కాగా ఇంకా 9.5 కి.మీ తవ్వాల్సి ఉంది.

News November 3, 2025

ములుగు: నెదర్లాండ్స్ పర్యటనకు మంత్రి సీతక్క..!

image

తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క విదేశీ పర్యటనకు బయలుదేరారు. స్త్రీ, శిశు సంక్షేమంపై అమలవుతున్న పథకాలు, ఇతర కార్యక్రమాలను పర్యవేక్షించే నిమిత్తం ఆమె నెదర్లాండ్స్‌కు వెళ్లారు. మంత్రి సీతక్క పర్యటన నేపథ్యంలో, పార్టీ వర్గాలు ఆమెకు ఆల్ ది బెస్ట్ తెలిపి, క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు.

News November 3, 2025

ఆసిఫాబాద్: 7 మద్యం షాపులకు.. రేపే లక్కీ డ్రా

image

ఆసిఫాబాద్ జిల్లాలో మిగిలిన 7 మద్యం దుకాణాలకు సోమవారం లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు ASF జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ జ్యోతి కిరణ్ తెలిపారు. జిల్లాలో 32 మద్యం దుకాణాలకు అక్టోబర్ 27న 25 మద్యం షాపులకు లక్కీ డ్రా నిర్వహించారు. 7 షాపులకు డబల్ డిజిట్ రానందున వాయిదా వేశారు. వాయిదా వేసిన షాపులకు రేపు లక్కీ డ్రా నిర్వహించనున్నారు.