News April 3, 2025

సిరిసిల్ల కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం

image

కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా పై హైకోర్టు మేజిస్ట్రేట్ ఆగ్రహం వ్యక్తంచేశారు. వేములవాడ మండలం అనుపురం గ్రామానికి చెందిన వనపట్ల కవిత తన ఇల్లు మిడ్ మానేరులో పోయిందని హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం కవితకు పునరావాసం కల్పించాలని కోర్టు తీర్పు ఇవ్వగా.. ఆ తీర్పు ఇల్లీగల్ ఆర్డర్ అంటూ మహిళపై కలెక్టర్ కేసు బుక్ చేయించారు. దీంతో విషయాన్ని ఆమె కోర్టు దృష్టికి తీసుకువెళ్లగా మేజిస్ట్రేట్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Similar News

News December 8, 2025

ఇంటి వద్ద నుంచి కూడా ఫిర్యాదులు సమర్పించండి: కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కారాన్ని మరింత వేగవంతం చేయాలని దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న PGRS కార్యక్రమం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం యథావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెట్రి సెల్వి ప్రకటనలో వెల్లడించారు. మండల, డివిజనల్ మున్సిపల్ కార్యాలయాల్లోనూ https://meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఇంటి వద్ద నుంచి కూడా ఫిర్యాదులు సమర్పించవచ్చన్నారు.

News December 8, 2025

HYD: గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధం

image

ఫ్యూచర్ సిటీలో నేడు, రేపు నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధం చేశారు. ఈ సమ్మిట్‌కు దేశ విదేశాలకు చెందిన పెట్టుబడుదారులు, పారిశ్రామిక వేత్తలు, ఐటీ కంపెనీల సీఈవోలు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు హాజరు కాబోతున్నారు. 8వ తేది మధ్యాహ్నం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ సమ్మిట్‌ను ప్రారంభించనున్నారు. 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు సమ్మిట్ ముగియనుంది.

News December 8, 2025

ఇంటి వద్ద నుంచి కూడా ఫిర్యాదులు సమర్పించండి: కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కారాన్ని మరింత వేగవంతం చేయాలని దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న PGRS కార్యక్రమం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం యథావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెట్రి సెల్వి ప్రకటనలో వెల్లడించారు. మండల, డివిజనల్ మున్సిపల్ కార్యాలయాల్లోనూ https://meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఇంటి వద్ద నుంచి కూడా ఫిర్యాదులు సమర్పించవచ్చన్నారు.