News July 1, 2024

సిరిసిల్ల: కానిస్టేబుల్‌పై హత్యాయత్నం.. వ్యక్తి అరెస్టు

image

కానిస్టేబుల్‌పై హత్యాయత్నానికి పాల్పడిన ఇసుక స్మగ్లర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. SP అఖిల్ మహాజన్ ప్రకారం.. రామలక్ష్మణపల్లె మానేరు వాగు నుంచి అక్రమంగా తరలిస్తున్న 5 ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని పోలీసులు స్టేషన్‌కు తరలిస్తున్నారు. ఈక్రమంలో గురుబాబు(30) అనే వ్యక్తి ట్రాక్టర్‌ను నడిపి చెరువులోకి తోసివేశాడు. కాగా, ఆ సమయంలో ట్రాక్టర్‌పై కానిస్టేబుల్ సత్యనారాయణ ఉండటంతో తీవ్ర గాయాలయ్యాయి.

Similar News

News November 18, 2025

KNR: డ్రగ్స్ మూలాలు పెకిలించివేయాలి: కలెక్టర్

image

యువత, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే మత్తుపదార్థాల మూలాలను పెకిలించివేయాలని, డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నేడు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్, ఎక్సైజ్, వైద్య ఆరోగ్య, శిశు సంక్షేమ, విద్య తదితర శాఖల అధికారులతో జిల్లాస్థాయి నార్కో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. మత్తుపదార్థాల నిర్మూలనకు నిత్యం గస్తీ నిర్వహిస్తున్నట్లు CP తెలిపారు.

News November 18, 2025

KNR: డ్రగ్స్ మూలాలు పెకిలించివేయాలి: కలెక్టర్

image

యువత, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే మత్తుపదార్థాల మూలాలను పెకిలించివేయాలని, డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నేడు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్, ఎక్సైజ్, వైద్య ఆరోగ్య, శిశు సంక్షేమ, విద్య తదితర శాఖల అధికారులతో జిల్లాస్థాయి నార్కో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. మత్తుపదార్థాల నిర్మూలనకు నిత్యం గస్తీ నిర్వహిస్తున్నట్లు CP తెలిపారు.

News November 18, 2025

14 మందితో ఎస్ఎఫ్ఐ నూతన గర్ల్స్ సబ్ కమిటీ ఏర్పాటు

image

కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ జిల్లా గర్ల్స్ సబ్ కమిటీని 14 మందితో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ పూజ, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు రజనీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ప్రవీణ్ శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈనెల 25, 26వ తేదీలలో నిజామాబాద్లో జరగబోయే రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్‌ను విజయవంతం చేయడానికి ప్రతిఒక్కరు కృషి చేయాలన్నారు.