News March 7, 2025

సిరిసిల్ల: కార్యదర్శులకు మెమోలు జారీ

image

సిరిసిల్ల జిల్లాలో సమయపాలన పాటించని కార్యదర్శులకు మెమోలు జారి చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ పంచాయతీ అధికారి శేషాద్రి తెలిపారు. వెల్జిపూర్, పొత్తూరు, ఓబులాపూర్, వల్లంపట్ల, కిష్టారావుపల్లి, తెలుగువారిపల్లి, పెద్ద లింగాపూర్, వెంకటరావుపల్లి, గంభీరావుపేట(M)లోని నర్మల, లక్ష్మీపూర్, ముస్తఫా నగర్, తంగళ్లపల్లి(M) నర్సింహులపల్లి, బద్దెనపల్లి, అంకిరెడ్డిపల్లి, బాలమల్లుపల్లి కార్యదర్శులకు మెమోలు జారీ చేశారు.

Similar News

News November 12, 2025

గురుకులాల బకాయిలు విడుదల చేయాలి: డిప్యూటీ సీఎం

image

ప్రజా భవన్‌లో గురుకులాల సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఎస్సీ, మైనారిటీ గురుకులాల ₹163 కోట్ల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందేలా అధికారులు మెనూను తప్పక పాటించాలని సూచించారు. ఆహార నాణ్యత, తనిఖీల విషయంలో రాజీ పడకూడదని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.

News November 12, 2025

ఢిల్లీ పేలుడు: తబ్లీగీ జమాత్ మసీదులో 15 నిమిషాలు గడిపి..

image

ఢిల్లీ పేలుడు ఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఉమర్ నబీకి సంబంధించి కీలక విషయాలు బయటపడుతున్నాయి. బ్లాస్ట్‌కు ముందు ఓల్డ్ ఢిల్లీలోని తబ్లీగీ జమాత్ మసీదుకు అతడు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ 10-15 నిమిషాలు గడిపాడని, తర్వాత ఎర్రకోటలోని పార్కింగ్ ప్లేస్‌కు వెళ్లాడని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. అతడు మసీదులోకి వచ్చి వెళ్లిన ఫుటేజీ సీసీటీవీలో రికార్డయిందని చెప్పాయి.

News November 12, 2025

HYD: ఫుడ్ స్టార్టప్‌లకు పోత్సాహకం: జయేష్ రంజన్

image

రాష్ట్రంలో సంప్రదాయ ఆహారానికి ప్రపంచ వేదికపై అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం దేశంలోనే తొలిసారి HYD వేదికగా ‘తెలంగాణ కలినరీ ఎక్స్‌‌‌‌పీరియన్షియల్ టూరిజం యాక్సిలరేటర్ (TSETA) ప్రారంభించింది. ఇండో- డచ్ సహకారంతో తెలంగాణ రుచులను ఇందులో ప్రదర్శించారు. ఫుడ్​ స్టార్టప్​లకు ప్రోత్సాహకంగా ఫుడ్-టెక్, డ్రింక్స్ రంగాల్లో స్టార్టప్‌‌‌‌లను ప్రోత్సహించనున్నట్లు స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ తెలిపారు.