News February 7, 2025
సిరిసిల్ల: కుక్కల వల్ల చిన్నారికి సోకిన వైరస్

కోనరావుపేట(M) కనగర్తికి చెందిన చేపూరి శ్రీమేధ(4) అనే చిన్నారికి జ్వరంతో పాటు శరీరంపై అలర్జీ ఏర్పడింది. అవి ఎక్కువ కావడంతో చిన్నారిని సిరిసిల్లలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అన్నిరకాల పరీక్షలు చేసినా నిర్ధారణ కాకపోవడంతో 4రోజుల క్రితం HYDలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు బ్రూసెల్లా ఇథి పీకల్ వైరస్ గా గుర్తించారు. కుక్కల కారణంగా ఈ వైరస్ సోకినట్టు వైద్యులు తెలిపారు.
Similar News
News February 23, 2026
రామచంద్రపురం: గోవాకు ప్రత్యేక టూర్ ప్యాకేజీ

HYD నుంచి గోవాకు ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించిందని డిపో మేనేజరు తెలిపారు. ఈనెల 25న BHEL నుంచి బయలుదేరే ఈ బస్సు, కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, ఉడిపి, మురుడేశ్వర్ ఆలయాల మీదుగా గోవాకు చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణం మార్చి 1న ఉదయం 6 గంటలకు గోవా నుంచి MGBS మీదుగా లింగంపల్లికి చేరుకుంటుందని తెలిపారు. ప్రయాణికులు www.tgsrtcbus.in వెబ్సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చని సూచించారు.
News February 23, 2026
పెళ్లి ముసుగులో మోసం.. అమ్మాయిలూ జాగ్రత్త: సజ్జనార్

TG: HYDలో పెళ్లి పేరుతో పెరుగుతున్న మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయని CP సజ్జనార్ తెలిపారు. నిశ్చితార్థమయ్యాక శారీరకంగా దగ్గరవుతున్నారని, ఆ తర్వాత భారీగా కట్నం ఇస్తేనే తాళి కడతామని డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రేమ పేరుతోనే కాకుండా పెద్దలు కుదిర్చిన సంబంధాల మాటున కూడా ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పారు. ఈ మోసాలపై యువతులు షీ టీమ్స్ వాట్సాప్(9490616555), డయల్ 100కి ఫిర్యాదు చేయవచ్చన్నారు.
News February 23, 2026
నరసరావుపేట: పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

జిల్లాలో ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణను కలెక్టర్ కృతిక శుక్లా స్వయంగా పర్యవేక్షించారు. పట్టణంలోని కాసు రాఘవమ్మ బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. పరీక్షా గదులను పరిశీలించారు. పరీక్షలు ఎటువంటి లోపాలు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని, విద్యార్థులకు తాగునీరు వంటి కనీస వసతుల్లో ఇబ్బంది కలగకూడదని అధికారులను ఆదేశించారు.


