News March 31, 2025

సిరిసిల్ల: కుటుంబ సభ్యుల పాత్ర కీలకం: కమాండెంట్

image

ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడంలో కుటుంబసభ్యుల బాధ్యత చాలా కీలకమని సిరిసిల్ల బెటాలియన్ కమాండెంట్ సురేష్ అన్నారు. సిరిసిల్ల పట్టణ పరిధి పెద్దూరులోని బెటాలియన్‌లో ఆర్ఎస్ఐ వై నారాయణ ఉద్యోగ విరమణ పొందిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కర్తవ్య నిర్వహణ కోసం తమ సుఖసంతోషాలను త్యాగంచేసి శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు అంకితం అవుతారని స్పష్టంచేశారు. ఉద్యోగవిరమణ అనంతరం కుటుంబసభ్యులతో ఆనందంగా గడపాలన్నారు.

Similar News

News December 6, 2025

‘మహానటి’ నుంచి ఈతరం ఏం నేర్చుకోవాలంటే?

image

మహానటి సావిత్రి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎంత స్టార్‌డమ్ వచ్చినా మూలాలను మర్చిపోకుండా సాధారణ నటిగానే మెలిగారు. ప్రత్యేక ఏర్పాట్లు, సెపరేట్ స్టాఫ్, అనవసరపు ఖర్చులతో ప్రొడ్యూసర్‌ని ఇబ్బంది పెట్టలేదు. జూనియర్ ఆర్టిస్టులతో కలివిడిగా ఉండేవారు. యూనిట్ సభ్యులను బాగా చూసుకునే వారు. క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తూ వెండితెరపై ఓ వెలుగు వెలిగారు. ఇవాళ సావిత్రి 90వ జయంతి.

News December 6, 2025

మే 17న JEE అడ్వాన్స్‌డ్

image

JEE అడ్వాన్స్‌డ్-2026 తేదీని IIT రూర్కీ ప్రకటించింది. దేశవ్యాప్తంగా మే 17న నిర్వహించనున్నట్లు తెలిపింది. 9AM నుంచి 12PM వరకు పేపర్-1, 2.30PM నుంచి 5.30PM వరకు పేపర్-2 ఉంటాయని వెల్లడించింది. పూర్తి షెడ్యూల్‌ త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. JEE మెయిన్‌లో టాప్ 2.5 లక్షల ర్యాంకుల్లో నిలిచిన విద్యార్థులు అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హులు. JEE మెయిన్ సెషన్-1 జనవరిలో, సెషన్-2 ఏప్రిల్‌లో జరగనున్నాయి.

News December 6, 2025

జిల్లాలో 23,719 PMUY కనెక్షన్లు.. MP ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం

image

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన(PMUY) కింద ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లలో 9.71 లక్షల ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్లు ఇవ్వబడినట్లు కేంద్ర మంత్రి సురేష్ గోపి లోక్ సభలో వెల్లడించారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ శుక్రవారం ఒక ప్రకటనలో ఈ వివరాలను తెలియజేశారు. లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి ఈ గణాంకాలను అందించారు. ఈ గణాంకాల ప్రకారం, ఏలూరు జిల్లాలో 23,719 ఉచిత కనెక్షన్లు మంజూరు చేయబడ్డాయని వెల్లడించారు.