News January 31, 2025

సిరిసిల్ల: కోడ్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలి: ఎన్నికల అధికారి

image

ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలుచేయాలని ఎమ్మెల్సీ ఎన్నికల అధికారి పమేలా సత్పతి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై టెలి కాన్ఫరెన్స్ ద్వారా సిరిసిల్ల పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఖిమ్యానాయక్‌తో శుక్రవారం మాట్లాడారు. పట్టభద్రుల, టీచర్ల ఓటర్ నమోదు పెండింగ్ దరఖాస్తులను ఫిబ్రవరి 7లోపు పరిష్కరించాలని ఆమె ఆదేశించారు. రాజకీయ పార్టీల హోల్డింగులు, గోడ రాతలు, జెండాలు తొలగించాలన్నారు.

Similar News

News February 10, 2025

హత్నూర: దౌల్తాబాద్ విద్యార్థుల ప్రతిభ

image

హైదరాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్ లో అగస్త్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ ఆదివారం నిర్వహించారు. హత్నూర మండలం దౌల్తాబాద్ 9వ తరగతి విద్యార్థులు నవాజ్, భవానీ, అన్విత క్రియ ఆర్టిజన్ స్పెక్ట్రమ్ డిజాస్టర్ నమూనాకు రూ. 30 వేల బహుమతి అందుకున్నారు. వీరిని జాతీయ స్థాయికి ఎంపిక చేశారు. విద్యార్థులు, గైడ్ ఉపాధ్యాయుడు వెంకటేశంను కలెక్టర్ వల్లూరు క్రాంతి అభినందించారు.

News February 10, 2025

ఇంటర్నేషనల్ కరాటే టోర్నమెంట్స్‌లో మందమర్రి బాలుడు

image

హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం న్యూ డ్రాగన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ కరాటే టోర్నమెంట్స్‌లో మందమర్రికి చెందిన బిఎంఆర్ కరాటే అకాడమీ విద్యార్థి సత్తా చాటారు. అండర్‌14 కటాస్ విభాగంలో జి. సాయి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ నటుడు భానుచందర్, బిఎంఆర్ అకాడమీ నిర్వాహకులు సంతోష్, మాస్టర్ కర్ర వెంకటేష్, శశి అభినందించారు.

News February 10, 2025

ధర్మార: ప్రియురాలు నో చెప్పిందని యువకుడు సూసైడ్

image

ధర్మారం మండలం ఖానంపల్లి గ్రామానికి చెందిన గడ్డం అజయ్ (22) తాను ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోను అని అనడంతో మనస్తాపం చెంది గతనెల 29న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా,చికిత్స పొందుతూ అజయ్ ఆదివారం మృతిచెందినట్లు ధర్మారం SI శీలంలక్ష్మణ్  తెలిపారు. అజయ్ తండ్రి గడ్డం ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

error: Content is protected !!