News February 17, 2025
సిరిసిల్ల: గంజాయితో పట్టుపడ్డ వ్యక్తి అరెస్టు

రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగిలో గంజాయితో పట్టుబడిన వ్యక్తిని రిమాండ్కు తరలించినట్టు చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. గంగాధర మండలానికి చెందిన పొత్తూరి రాకేశ్ అనే వ్యక్తి రుద్రంగిలో గంజాయి విక్రయించేందుకు వచ్చినట్లు తెలిపారు. ఎన్డిపీఏస్ చట్టం ప్రకారం గంజాయి కలిగి ఉండటం, రవాణా చేయటం, తాగటం, అమ్మటం నేరమని తెలిపారు. ఎవరైనా, ఎక్కడైనా గంజాయి కలిగి ఉన్నట్లు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.
Similar News
News October 31, 2025
రాజమండ్రి: నవంబర్ 1 నుంచి స్వాభిమాన్ ఉత్సవాలు

బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని నవంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు గిరిజన స్వాభిమాన్ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్టీ సంక్షేమ, సాధికారిత అధికారి కె.ఎన్. జ్యోతి తెలిపారు. గిరిజన సమాజ చరిత్ర, వారసత్వం, సాంస్కృతిక విలువలు ప్రతిబింబించేలా ఈ ఉత్సవాలు జరుగుతాయన్నారు. నవంబర్ 1న బిర్సా ముండా జ్ఞాపకార్థం మొక్కల పెంపకం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.
News October 31, 2025
సిరిసిల్ల: మిగిలి ఉన్న సీట్ల భర్తీకి కౌన్సిలింగ్

సిరిసిల్ల జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతుల నుంచి 9వ తరగతి వరకు మిగిలి ఉన్న సీట్ల భర్తీకై కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్టు గురుకుల పాఠశాల కోఆర్డినేటర్ తెరిసా తెలిపారు. సిరిసిల్లలో శుక్రవారం ఆమె ప్రకటన విడుదల చేశారు. నవంబర్ 4న ఉదయం 11 గంటలకు చిన్న బోనాలలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు హాజరుకావాలని ఆమె కోరారు.
News October 31, 2025
ఆ మందు లేదన్నందుకు వైన్షాప్ క్యాషియర్పై దాడి

ఖమ్మం: ఆ మద్యం బ్రాండ్(రాయల్ స్ట్రాంగ్) ఇవ్వలేదన్న కోపంతో వైన్ షాప్ క్యాషియర్పై యువకులు దాడి పాల్పడిన ఘటన తిరుమలాయపాలెం మండలంలో చోటుచేసుకుంది. పిండిప్రోలులోని ఓ వైన్ షాప్లో పనిచేసే పోలెపొంగు కృష్ణ అనే క్యాషియర్పై ఐదుగురు యువకులు తనకు నచ్చిన మధ్యం ఇవ్వాలని అడిగారు. అది లేదనడంతో కోపంతో డాడికి పాల్పడ్డారు. దాడి వీడియోలు సీసీ కెమెరాలు రికార్డు కాగా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.


