News February 17, 2025
సిరిసిల్ల: గంజాయితో పట్టుపడ్డ వ్యక్తి అరెస్టు

రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగిలో గంజాయితో పట్టుబడిన వ్యక్తిని రిమాండ్కు తరలించినట్టు చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. గంగాధర మండలానికి చెందిన పొత్తూరి రాకేశ్ అనే వ్యక్తి రుద్రంగిలో గంజాయి విక్రయించేందుకు వచ్చినట్లు తెలిపారు. ఎన్డిపీఏస్ చట్టం ప్రకారం గంజాయి కలిగి ఉండటం, రవాణా చేయటం, తాగటం, అమ్మటం నేరమని తెలిపారు. ఎవరైనా, ఎక్కడైనా గంజాయి కలిగి ఉన్నట్లు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.
Similar News
News March 18, 2025
విశాఖ మేయర్ పీఠాన్ని కాపాడుకుంటాం: కన్నబాబు

AP: విశాఖ మేయర్ పీఠంపై <<15799147>>కూటమి కన్నేయడంతో<<>> వైసీపీ అప్రమత్తమైంది. ఇవాళ కార్పొరేటర్లతో ఉత్తరాంధ్ర సమన్వయకర్త కన్నబాబు సమావేశయ్యారు. ఈ భేటీకి 34 మంది హాజరుకాగా, ముగ్గురు రాలేదు. తమ కార్పొరేటర్లను ప్రలోభపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. మేయర్ స్థానాన్ని కాపాడుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. చీప్ పాలిటిక్స్ మానుకోవాలని CBNకు మాజీ మంత్రి అమర్నాథ్ హితవు పలికారు.
News March 18, 2025
రన్యారావు కేసులో వెలుగులోకి కీలక విషయాలు

బంగారం స్మగ్లింగ్ చేస్తూ అరెస్టైన కన్నడ నటి రన్యారావు కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె తన స్నేహితుడు తరుణ్ రాజుతో 26 సార్లు దుబాయ్ వెళ్లినట్లు, ఆ సమయంలోనూ స్మగ్లింగ్ చేసినట్లు DRI కోర్టు విచారణలో పేర్కొంది. ఆ సమయంలో వీరిద్దరూ ఉదయం బయలుదేరి సాయంత్రం తిరిగొచ్చేవారంది. దుబాయ్లో రాజు ఆర్థిక లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నట్లు, అతనికి లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు వివరించింది.
News March 18, 2025
OTTలోకి కొత్త సినిమాలు

తమిళ హీరో ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ సినిమా ఈనెల 21 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. దీనితో పాటు మలయాళ మిస్టరీ థ్రిల్లర్ ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ నెట్ఫ్లిక్స్లో ఈనెల 20 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ మూవీ తెలుగులో ఈనెల 14న థియేటర్లలో రిలీజైంది. వారం రోజుల్లోనే OTT బాట పట్టింది. ఈనెల 21 నుంచి ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ కూడా నెట్ఫ్లిక్స్లోకి రానుంది.