News February 12, 2025

సిరిసిల్ల: గంజాయి సాగుచేస్తూ.. తాగుతున్న వ్యక్తుల అరెస్ట్

image

సిరిసిల్ల మండలం పెద్దూరు మెడికల్ కాలేజీ పక్కన 4 వ్యక్తులు గంజాయిని సాగుచేస్తూ.. తాగుతుండగా వారిని అరెస్ట్ రిమాండ్ తరలించామని CI కృష్ణ తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన దేద్రాడ్ ధలి, మాలే మాలిక్, ప్రణబ్ సింగ్, సాగర్ సర్కార్ అనే వ్యక్తులు మెడికల్ కాలేజ్ నిర్మాణానికి వచ్చారు. పక్కనే ఉన్న స్థలంలో గంజాయి మొక్కలను సాగుచేస్తూ.. తాగుతున్నారు. వారిని అదుపులోకి తీసుకుని 50G గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News February 13, 2025

జూన్‌లో ‘స్థానిక’ ఎన్నికలు?

image

TG: బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించిన తర్వాతే ‘స్థానిక’ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. MARలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బిల్లును కేంద్రానికి పంపాలని చూస్తోంది. అటు MAR, APRలో ఇంటర్, పది పరీక్షలుండటంతో ప్రభుత్వ టీచర్లంతా అందులోనే నిమగ్నం కానున్నారు. ఆపై APR, MAYలో ఎండల తీవ్రత వల్ల ఎన్నికలు నిర్వహించకపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. జూన్, జులైలో ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉందంటున్నారు.

News February 13, 2025

సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతికి సెలవు ప్రకటించాలి

image

లంబాడాల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని ఫిబ్రవరి 15న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించాలని, లంబాడీల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈమేరకు రాష్ట్ర అధ్యక్షుడు డా.రాజ్ కుమార్ జాదవ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ గుగులోత్ ప్రవీణ్ నాయక్ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం కమాండ్ కంట్రోల్ ప్రాంగణంలో మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం అందజేసింది. సెలవు ప్రకటించేలా కృషి చేస్తానని చెప్పారు.

News February 13, 2025

అనకాపల్లి జిల్లాలో మరో ఆరు అన్న క్యాంటీన్లు

image

అనకాపల్లి జిల్లాలో మరో ఆరు అన్న క్యాంటీన్లు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ప్రస్తుతం అన్న క్యాంటీన్లు ఉన్న అనకాపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలి నియోజకవర్గాల్లో మరో మూడు క్యాంటీన్లు అదనంగా ఏర్పాటు చేస్తారు. అలాగే కొత్తగా పాయకరావుపేట, మాడుగుల, చోడవరంలో క్యాంటీన్లు ఏర్పాటు కానున్నాయి.

error: Content is protected !!