News March 23, 2025
సిరిసిల్ల: గీత ఐస్ క్రీమ్.. ఓ మధుర జ్ఞాపకం

ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఆ రోజుల్లో గీత ఐస్ క్రీమ్ లేకుండా కాలం గడిచేది కాదు. ఒక్క రూపాయికి మాత్రమే లభించే గీత ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్, పెప్సీ ఐస్ క్రీమ్లు ప్రస్తుత రోజుల్లో మధుర జ్ఞాపకంగా మారిపోయాయి. వందల రూపాయలు పెట్టి ఐస్ క్రీములు తిన్నప్పటికీ గీత ఐస్ క్రీమ్ మర్చిపోలేమని ఇప్పటికీ ఆ మాటలు వినిపిస్తూనే ఉంటాయి. మీ చిన్నతనంలో గీత ఐస్ క్రీమ్ తిన్నారా? తింటే.. కింద కామెంట్ చేయండి..!
Similar News
News February 23, 2026
అజిత్ పవార్ హెలికాప్టర్ ప్రమాదం: ఫిబ్రవరి 28 నాటికి రిపోర్ట్!

అజిత్ పవార్ మరణానికి కారణమైన హెలికాప్టర్ ప్రమాదంపై ప్రాథమిక నివేదిక ఈ నెల 28 లోపు విడుదల కానున్నట్లు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ తెలిపారు. నిబంధనల ప్రకారం నెల రోజుల్లోపు రిపోర్ట్ ఇవ్వాల్సి ఉండటంతో శనివారానికల్లా వాస్తవాలు బయటకు రానున్నాయి. మరోవైపు ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందంటూ అజిత్ పవార్ మేనల్లుడు రోహిత్ పవార్ ఆరోపణలు చేయడంతో ఈ రిపోర్ట్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
News February 23, 2026
CM కప్లో కామారెడ్డి క్రీడాకారుల పతకాల పంట

TG ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘CM కప్’ రాష్ట్రస్థాయి పోటీల్లో కామారెడ్డి జిల్లా క్రీడాకారులు పతకాల పంట పండించారు. వివిధ క్రీడా విభాగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి బంగారు, వెండి, కాంస్య పతకాలతో పాటు నగదు బహుమతులను కైవసం చేసుకున్నారని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి వెంకటేశ్వర గౌడ్ తెలిపారు. రాష్ట్రస్థాయిలో జిల్లా పేరును నిలబెట్టిన క్రీడాకారులకు, కోచ్ లను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అభినందించారు.
News February 23, 2026
PDPL: లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత మల్ల రాజిరెడ్డి

PDPL(D) మంథని(M) శాస్త్రులపల్లి చెందిన మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్ల రాజిరెడ్డి అలియాస్ సత్తన్న ఆదివారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. 1975లో అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన, ఆపరేషన్ కగార్ పేరిట వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్ల, అనారోగ్యం, పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారడంతో పోలీసులకు సరెండర్ అయ్యారు. 2007 కేరళ జిల్లాలో SIB పోలీసులు అరెస్టు చేయగా, 2009లో బెయిల్పై విడుదలై మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లారు.


