News January 26, 2025

సిరిసిల్ల : గ్రామసభలో వచ్చిన మొత్తం దరఖాస్తులు 40,360

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 255 గ్రామసభలు, 67 వార్డులలో విజయవంతంగా నిర్వహించామని, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. నూతనంగా 16,505 రేషన్ కార్డు దరఖాస్తులు, 14,542 ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు, 141 రైతుభరోసా దరఖాస్తులు, 9,172 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా దరఖాస్తులు మొత్తం 40,360 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. 4 నూతన పథకాల లాంచింగ్‌కు ప్రభుత్వ ఆదేశాల మేరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తామన్నారు.

Similar News

News February 25, 2026

అనకాపల్లి స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యంగా పని చేయాలి: కలెక్టర్

image

స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యంగా పని చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్‌లో స్వర్ణాంధ్ర-2047 ప్రణాళికకు సంబంధించి విజన్ యాక్షన్ ప్లాన్‌పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్వర్ణాంధ్ర విజన్ లో భాగంగా పీ-4 విధానం అమలు జరుగుతుందన్నారు. అభివృద్ధి దిశగా అధికారులు కృషి చేయాలన్నారు. సమాజంలో దిగువ స్థాయిలో ఉన్న ప్రజలను అన్ని విధాల అభివృద్ధిలోకి తీసుకురావాలని సూచించారు.

News February 25, 2026

HYD: మీకూ ఈ లక్షణాలు ఉన్నాయా? జాగ్రత్త!

image

మనిషిని కుంగదీస్తున్న మానసిక రోదన వెనక అనేక కారణాలు ఉన్నాయని మేడిపల్లి డా.సుప్రజ తెలిపారు. మనసు విశ్రాంతిని, మార్పును కోరుకుంటోందని చెప్పే సంకేతం. నీరసం, చిన్నదానికే కోపం, కన్నీళ్లు, నలుగురిలోకి వెళ్లలేకపోవడం లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త. ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, ఒంటరితనం, SM వంటివి తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వివరించారు. ఫోన్లు దూరంపెట్టి నచ్చిన పనిచేస్తే ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదలవుతాయన్నారు.

News February 25, 2026

27, 28 తేదీల్లో దానం, కడియంల విచారణ

image

TG: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారం కీలక దశకు చేరుకుంది. ఈ నెల 27, 28 తేదీల్లో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న దానం నాగేందర్, కడియం శ్రీహరిలను స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించనున్నారు. వారు BRS గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరలేదని నిరూపించుకోవడానికి అవసరమైన ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. కాగా 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మందికి ఇప్పటికే స్పీకర్ క్లీన్‌చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.