News January 26, 2025
సిరిసిల్ల : గ్రామసభలో వచ్చిన మొత్తం దరఖాస్తులు 40,360

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 255 గ్రామసభలు, 67 వార్డులలో విజయవంతంగా నిర్వహించామని, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. నూతనంగా 16,505 రేషన్ కార్డు దరఖాస్తులు, 14,542 ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు, 141 రైతుభరోసా దరఖాస్తులు, 9,172 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా దరఖాస్తులు మొత్తం 40,360 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. 4 నూతన పథకాల లాంచింగ్కు ప్రభుత్వ ఆదేశాల మేరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తామన్నారు.
Similar News
News November 14, 2025
భద్రకాళి అమ్మవారికి విశేష పూజలు

ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళి దేవస్థానంలో కార్తీక మాసం శుక్రవారం సందర్భంగా ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు చేశారు. కార్తీక శుక్రవారం కావడంతో భక్తులు ఉదయం నుంచి ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకొని పూజలు చేస్తున్నారు.
News November 14, 2025
KVS, NVSలో 14,967 పోస్టుల వివరాలు

<
News November 14, 2025
కాకినాడ- అనకాపల్లి మధ్య ఎయిర్ పోర్టు: CM

ఉమ్మడి తూ.గో జిల్లాలను ఎకనమిక్ రీజియన్లో చేర్చి అభివృద్ధిని పరుగులు పెట్టించాలని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో గురువారం జరిగిన సదస్సులో 3 జిల్లాల కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. కాకినాడ- అనకాపల్లి మధ్య చిన్న ఎయిర్ పోర్టు నిర్మిస్తామని చెప్పారు. కడియం నర్సరీలు, పర్యాటక ప్రాంతాలను ప్రమోట్ చేయాలన్నారు. తలసరి ఆదాయం కోనసీమ రూ.2.09 లక్షలు, కాకినాడ రూ.2.42L, తూ.గో రూ.2.59 లక్షలుగా ఉందన్నారు.


