News March 12, 2025

సిరిసిల్ల: గ్రూప్-1లో సత్తా చాటిన హరిణి

image

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం అనంతపల్లి గ్రామానికి చెందిన కన్నం హరిణి గ్రూప్-1 ఫలితాల్లో సత్తా చాటింది. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో 499.5 మార్కులు సాధించింది. హరిణి సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా ఉద్యోగం వదిలేసి పరీక్షకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అభినందించారు.

Similar News

News March 16, 2025

రాజకీయ పార్టీలతో కలెక్టర్ రాహుల్ రాజ్ సమావేశం

image

వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ రాహుల్ రాజ్ సమావేశం నిర్వహించారు. నూతన ఓటరుగా నమోదు చేసుకున్న ఫారమ్ 6, 7, 8లను పరిశీలించి పూర్తి చేయాలని పేర్కొన్నారు. బిఎల్ఏలు, గ్రామ స్థాయి అధికారులు దరఖాస్తులను పెండింగ్‌లో లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈవీఎంల మీద సందేహాలను నివృత్తి చేయడం జరిగిందని తెలిపారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఖర్చుల నివేదికలు త్వరగా అందించాలన్నారు.

News March 16, 2025

బాపట్ల జిల్లా TO DAY TOP HEADLINES

image

◆బాపట్ల ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు◆మార్టూరు: పదవ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం◆బాపట్ల: పరిసరాలను శుభ్రం చేసిన అడిషనల్ ఎస్పీ◆చీరాల: రైళ్లలో చోరీకి పాల్పడుతున్న దొంగ అరెస్టు◆బాపట్ల: ఇంటర్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన స్పెషలాఫీసర్◆వేమూరులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి◆పర్చూరు మండలాన్ని కమ్మేసిన పొగ మంచు◆రాజకీయ చరిత్రలో సీఎం చంద్రబాబు అరుదైన రికార్డు: ఎమ్మెల్యే ఏలూరి

News March 16, 2025

HYD: ఓయూ క్యాంపస్‌లో ఇవి బంద్!

image

ఓయూలో ఆందోళనలు, ప్రదర్శనలపై నిషేధం విధిస్తూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేశ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నిర్ణయంపై విద్యార్థి సంఘాలు మూకుమ్మడిగా మండిపడుతున్నాయి. శాంతియుతంగా నిరసన తెలుపడం ప్రజాస్వామ్య హక్కు అని, దానిని అణిచివేయాలని చూస్తే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాయి.

error: Content is protected !!