News March 12, 2025

సిరిసిల్ల: గ్రూప్-1లో సత్తా చాటిన హరిణి

image

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం అనంతపల్లి గ్రామానికి చెందిన కన్నం హరిణి గ్రూప్-1 ఫలితాల్లో సత్తా చాటింది. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో 499.5 మార్కులు సాధించింది. హరిణి సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా ఉద్యోగం వదిలేసి పరీక్షకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అభినందించారు.

Similar News

News February 9, 2026

12న కొమురవెల్లి మల్లన్న హుండీ లెక్కింపు

image

సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి దేవస్థాన హుండీలను ఈనెల 12న లెక్కించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 9 గంటల నుంచి నగదు, బియ్యం హుండీల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆలయ కార్యనిర్వాహక అధికారి ఒక ప్రకటనలో కోరారు.

News February 9, 2026

పబ్‌జీ ఆడుతుండగా 300 దాటిన BP.. మెదడు నరాలు చిట్లి మృతి

image

మేరఠ్‌(UP)కు చెందిన మహ్మద్ కైఫ్(22) 4నెలలుగా PUBG గేమ్‌కు అలవాటుపడ్డారు. శుక్రవారం హెడ్‌ఫోన్స్ పెట్టుకొని అర్ధరాత్రి వరకు ఆడుతూనే ఉన్నారు. ఒక్కసారిగా కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. చెవులు, ముక్కు నుంచి రక్తం కారిన అతనికి ట్రీట్‌మెంట్ చేసినా ఆదివారం రాత్రి ప్రాణాలు కోల్పోయారు. మెంటల్ ప్రెజర్‌తో BP 300 దాటి బ్రెయిన్‌లోని నరాలు చిట్లి రక్తస్రావమైనట్లు డాక్టర్లు తేల్చారు.

News February 9, 2026

దేనికోసం బాయ్‌కాట్? పాక్‌పై గంగూలీ ఫైర్

image

T20 WCలో భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలనే పాకిస్థాన్ నిర్ణయంపై గంగూలీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎలాగూ శ్రీలంకలో ఆడుతున్నప్పుడు ఇబ్బందేంటని ప్రశ్నించారు. అసలు దేనికోసం ఈ నిర్ణయం తీసుకున్నారని నిలదీశారు. వరల్డ్ కప్‌లో ప్రతీ పాయింట్ ముఖ్యమేనని హితవు పలికారు. బంగ్లాకు మద్దతు పలుకుతూ Feb 15న కొలంబోలో భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను పాక్ బహిష్కరించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.