News January 13, 2025

సిరిసిల్ల: జగన్నాథం పార్థివదేహాన్ని సందర్శించిన కేటీఆర్

image

అనారోగ్యంతో మృతి చెందిన మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నాయకులు మంద జగన్నాథం పార్థివదేహాన్ని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. జగన్నాథం ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.

Similar News

News November 28, 2025

కరీంనగర్ కలెక్టర్‌కు భారత్ గౌరవ్ అవార్డు

image

కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మక భారత్ గౌరవ్ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జీష్ణు దేవ్, చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా స్వీకరించారు. వినూత్న ఆలోచనలతో సమాజ చైతన్యం కోసం విలక్షణ కార్యక్రమాలు చేపడుతున్న కలెక్టర్‌కు ఈ అవార్డు ప్రదానం చేసినట్లు భారత్ గౌరవ అవార్డు కమిటీ స్పష్టం చేసింది. విధి నిర్వహణలో కలెక్టర్ చేస్తున్న కృషిని కొనియాడారు.

News November 28, 2025

KNR: శుక్రవారం సభను సందర్శించిన అడిషనల్ కలెక్టర్

image

మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ అర్బన్ మండలం కొత్తపల్లి సెక్టార్, రాజీవ్ గృహకల్ప, అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే హాజరై మాట్లాడారు. మహిళలు తమ సమస్యలు ఏవైనా శుక్రవారం సభలో విన్నవించుకోవచ్చని అన్నారు. ప్రతి మహిళలు గర్భిణీ, బాలింత శుక్రవారం సభకు తప్పక హాజరు కావాలని సూచించారు.

News November 28, 2025

కరీంనగర్: NMMSS ‘కీ’ విడుదల

image

8వ తరగతి విద్యార్థులకు ఈనెల 23న నిర్వహించిన NMMSS స్కాలర్ షిప్ అర్హత పరీక్ష KEY విడుదలైందని కరీంనగర్ DEO మొండయ్య తెలిపారు. కీ పేపర్ పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే డిసెంబర్ 6 వరకు http/bse.telangana.gov.in సైట్‌లో లేదా dirgovexams.tg@gmail.comకి పంపాలని అన్నారు. లేదా డైరెక్టర్ ప్రభుత్వ పరీక్షలు, హైదరాబాద్ నందు సమర్పించాలని తెలిపారు. డిసెంబర్ 6 తరువాత వచ్చిన అభ్యంతరాలను స్వీకరించబడవని అన్నారు.